నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పిందని అన్నారు. ఎల్ ఆర్ ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్దమైంది.
నో ఎల్.ఆర్.ఎస్ – నో బీ.ఆర్.ఎస్ అంటూ గతం లో ప్రజలను రెచ్చగొట్టి ఇపుడు ఎల్.ఆర్.ఎస్ కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనం అని అన్నారు.
కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, గతం లో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్.ఆర్.ఎస్ ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలని లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Post Views: 89