+91 95819 05907

కూసుమంచి మండలంలో ఏ పార్టీకి మెజారిటీ దక్కేను..? కాంగ్రెస్ పార్టీ గట్టెక్కేనా?

పోలింగ్ సరళిలో అధికార పార్టీకి చుక్క ఎదురు అంటూ ప్రచారం..

అదే జరిగితే కాంగ్రెస్ నాయకులకు చుక్క ఎదురేనా..?

లోకల్ నాయకుల అలసత్వం మంత్రి పొంగులేటికి తలవంపు తెచ్చేనా..?

నేటి గదర్,మే 28 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

నిన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది… ఇక సామాన్యుల నుండి రాజకీయ విశ్లేషకుల వరకు ఎమ్మెల్సీ ఓటింగ్ సరళిపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.. ఇక పాలేరు నియోజకవర్గంలో మాత్రం ఎందుకో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీచింది అనే చర్చ విస్తృతంగా సాగుతుంది… ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరులోని కూసుమంచి మండలంకి ఎంతో ప్రాధాన్యత ఉంది.. మనసున్న నాయకుడు …మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన పేరు వినిపిస్తేనే ఎగిరి గంతులు వేసే కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.. అందుకే ఆయనకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు బారి మెజారిటీ ఇచ్చి తమ ప్రేమను , అభిమానాన్ని చాటుకున్నారు.. అంతటి ఘన విజయం వెనక నాయకులుగా చలామణి అవుతున్న వారితో వచ్చిన ఓట్లు కావవి… మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎనలేని ప్రేమను పెంచుకున్న కార్యకర్తల ,అభిమానుల ప్రేమతో మాత్రమే వచ్చిన ఓట్లవి … కానీ మండల స్థాయి నాయకుల నుండి గ్రామ స్థాయి నాయకులుగా చలామణి అవుతున్న నాయకులు (కానీ నిజమైన కాంగ్రెస్ వాదులు ,కష్టపడ్డ వారు కాదు అలాగే పాత కొత్త అనే తేడా లేదు) మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని గ్రామాల్లో వచ్చిన మెజారిటీ ఓట్లుకు తామే కారణం తమ కష్టార్జితం అనుకుంటూ తమ ఉపన్యాసాలు ఉదరగొడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర తమ గొప్పలు ఉదరగొడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. సరే వారి ప్రచారాలు ఎలా ఉన్నా అసెంబ్లీ మెజారిటీ అనేది గతం ..కానీ నిన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూసుమంచి మండలంలో జరిగిన పోలింగ్ సరళి మాత్రం అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీ తరపున పోటీలో నిలబడిన వ్యక్తికే అధిక సంఖ్యలో పట్టభద్రులు మరలినట్టు ప్రచారం జరగడం కోస మెరుపు.. నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా పూర్తి కాక ముందే వ్యతిరేకత అంటూ ప్రచారం జరగడానికి కారణం ఎవరు అంటే.. ముమ్మాటికీ మాత్రం కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మండల ,గ్రామ స్థాయిలో ఉన్న నాయకుల మధ్య విభేదాలు… అలాగే మండలం ,గ్రామ స్థాయిలో ఉన్న ముఖ్య నాయకుల సమన్వయం లోపం కారణంగానే పట్టభద్రులను కాంగ్రెస్ వైపు మరలించే ప్రయత్నం కూడా చిత్తశుద్ధితో చేయకపోవటమే మరో కారణంగా కనిపిస్తుంది అనే అనుమానం వ్యక్తం అవుతుంది.. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు , కాని 5వ తేదీన వెలువడే ఫలితం మాత్రం మండలంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తక్కువగా వస్తె మండల , గ్రామ స్థాయి నాయకులకు అది చంపపెట్టే… ఒకవేళ మెజారిటీ రాకపోతే మాత్రం ముమ్మాటికీ మండల ,గ్రామ స్థాయిలో నాయకులుగా చలామణి అవుతున్న నాయకులే కారణం అవుతారు అనడంలో అతిశయోక్తి కాదు.. వీరి విపరీత పోకడ వాళ్ళే పార్టీకి నష్టం కలిగింది అనే చర్చ విస్తృతంగా ప్రచారం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేకపోలేదు.. చూడాలి నిన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అధికార పార్టీకి మెజారిటీ వస్తె నాయకులు అందరూ సేఫ్ అన్నట్టే .. లేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు తమ ధోరణిని మార్చుకుని అందరినీ కలుపుకపోతే తప్ప పరిస్థితులు అనుకూలంగా మరే అవకాలు లేవనే చెప్పాలి .. లేదా ఈ నాయకుల కారణంగానే కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గంలో మసకబారే అవకాశం లేకపోలేదు.. ఈ పరిస్థితులను తప్పక చక్కదిద్దాలి అనుకుంటున్నారు మండల ప్రజలు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !