+91 95819 05907

కూసుమంచి మండలంలో ఏ పార్టీకి మెజారిటీ దక్కేను..? కాంగ్రెస్ పార్టీ గట్టెక్కేనా?

పోలింగ్ సరళిలో అధికార పార్టీకి చుక్క ఎదురు అంటూ ప్రచారం..

అదే జరిగితే కాంగ్రెస్ నాయకులకు చుక్క ఎదురేనా..?

లోకల్ నాయకుల అలసత్వం మంత్రి పొంగులేటికి తలవంపు తెచ్చేనా..?

నేటి గదర్,మే 28 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

నిన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది… ఇక సామాన్యుల నుండి రాజకీయ విశ్లేషకుల వరకు ఎమ్మెల్సీ ఓటింగ్ సరళిపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.. ఇక పాలేరు నియోజకవర్గంలో మాత్రం ఎందుకో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీచింది అనే చర్చ విస్తృతంగా సాగుతుంది… ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరులోని కూసుమంచి మండలంకి ఎంతో ప్రాధాన్యత ఉంది.. మనసున్న నాయకుడు …మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన పేరు వినిపిస్తేనే ఎగిరి గంతులు వేసే కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.. అందుకే ఆయనకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు బారి మెజారిటీ ఇచ్చి తమ ప్రేమను , అభిమానాన్ని చాటుకున్నారు.. అంతటి ఘన విజయం వెనక నాయకులుగా చలామణి అవుతున్న వారితో వచ్చిన ఓట్లు కావవి… మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎనలేని ప్రేమను పెంచుకున్న కార్యకర్తల ,అభిమానుల ప్రేమతో మాత్రమే వచ్చిన ఓట్లవి … కానీ మండల స్థాయి నాయకుల నుండి గ్రామ స్థాయి నాయకులుగా చలామణి అవుతున్న నాయకులు (కానీ నిజమైన కాంగ్రెస్ వాదులు ,కష్టపడ్డ వారు కాదు అలాగే పాత కొత్త అనే తేడా లేదు) మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని గ్రామాల్లో వచ్చిన మెజారిటీ ఓట్లుకు తామే కారణం తమ కష్టార్జితం అనుకుంటూ తమ ఉపన్యాసాలు ఉదరగొడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర తమ గొప్పలు ఉదరగొడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. సరే వారి ప్రచారాలు ఎలా ఉన్నా అసెంబ్లీ మెజారిటీ అనేది గతం ..కానీ నిన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూసుమంచి మండలంలో జరిగిన పోలింగ్ సరళి మాత్రం అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీ తరపున పోటీలో నిలబడిన వ్యక్తికే అధిక సంఖ్యలో పట్టభద్రులు మరలినట్టు ప్రచారం జరగడం కోస మెరుపు.. నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా పూర్తి కాక ముందే వ్యతిరేకత అంటూ ప్రచారం జరగడానికి కారణం ఎవరు అంటే.. ముమ్మాటికీ మాత్రం కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మండల ,గ్రామ స్థాయిలో ఉన్న నాయకుల మధ్య విభేదాలు… అలాగే మండలం ,గ్రామ స్థాయిలో ఉన్న ముఖ్య నాయకుల సమన్వయం లోపం కారణంగానే పట్టభద్రులను కాంగ్రెస్ వైపు మరలించే ప్రయత్నం కూడా చిత్తశుద్ధితో చేయకపోవటమే మరో కారణంగా కనిపిస్తుంది అనే అనుమానం వ్యక్తం అవుతుంది.. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు , కాని 5వ తేదీన వెలువడే ఫలితం మాత్రం మండలంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తక్కువగా వస్తె మండల , గ్రామ స్థాయి నాయకులకు అది చంపపెట్టే… ఒకవేళ మెజారిటీ రాకపోతే మాత్రం ముమ్మాటికీ మండల ,గ్రామ స్థాయిలో నాయకులుగా చలామణి అవుతున్న నాయకులే కారణం అవుతారు అనడంలో అతిశయోక్తి కాదు.. వీరి విపరీత పోకడ వాళ్ళే పార్టీకి నష్టం కలిగింది అనే చర్చ విస్తృతంగా ప్రచారం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేకపోలేదు.. చూడాలి నిన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అధికార పార్టీకి మెజారిటీ వస్తె నాయకులు అందరూ సేఫ్ అన్నట్టే .. లేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు తమ ధోరణిని మార్చుకుని అందరినీ కలుపుకపోతే తప్ప పరిస్థితులు అనుకూలంగా మరే అవకాలు లేవనే చెప్పాలి .. లేదా ఈ నాయకుల కారణంగానే కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గంలో మసకబారే అవకాశం లేకపోలేదు.. ఈ పరిస్థితులను తప్పక చక్కదిద్దాలి అనుకుంటున్నారు మండల ప్రజలు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !