+91 95819 05907

రామాయంపేటలో ఘనంగా మహంకాళమ్మ బోనాల జాతర ఉత్సవాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 28:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆషాడం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.మున్సిపల్ పరిధిలో ఉన్న మహంకాళి దేవాలయం 40వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.ఉదయం నుండి రామాయంపేట పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. రామాయంపేట పట్టణంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో మహిళలు మట్టికుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకొని డప్పు చప్పుళ్ళతో పోతరాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి బోనాలను నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ ప్రాంగణంలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రాంగణంలో మున్సిపల్ కార్మికులు ఎలాంటి చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు తొలగించారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్థానిక ఎస్సై రంజిత్ కుమార్ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.గత మూడు రోజుల నుండి మహంకాళి దేవాలయంలో ఆషాడ మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖసంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని వారు అమ్మవారిని కోరుకున్నట్లు ప్రజలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వడదెబ్బ కి మహిళ మృతి? కుటుంబ సభ్యులు తెలిపిన కారణాలు ఇవే.

మండలంలోని ఏడూళ్ళ బయ్యారం పంచాయతీ పరిధిలోని పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డ్ సభ్యురాలు తాటి రత్తాలు (55 సం) శుక్రవారం రాత్రి వడదెబ్బ సోకి మృతి చెందింది. ఆదివారం తన చెల్లి కూతురు

Read More »

సింగరేణి గ్రామ ప్రజల శ్రేయస్సే నా ధ్యేయం :షేక్ గౌసిద్దీన్.

-కులమతాలకు అతీతంగా సింగరేణి గ్రామంలో సేవా కార్యక్రమాలు. -హిందూ స్మశానవాటిక కు రూ.25 వేల సబ్ మెర్సబుల్ పంప్ సెట్టు వితరణ. తన సేవా తత్పురతను చాటుకుంటున్న -బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు,

Read More »

సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

నేటి గదర్ న్యూస్,ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండల సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై మధిర నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిరసన

నేటి గదర్ న్యూస్, మార్చి 15 ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ మధిర నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి జి జగదీశ్ రెడ్డి అసెంబ్లీ

Read More »

ప్రతి ఒక్కరి జీవితాల్లో హోళి పండుగ రంగుల హరివిల్లుల సరికొత్త కాంతులు నింపాలి : నాగేళ్లి

మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ గారికి,సింగరేణి అధికారుల సంఘ ప్రతినిధి లక్ష్మి పతి గౌడ్ గారికి, ఏరియా డి వై జి యం రమేష్ గారికి, ఓ . సి

Read More »

సత్య సాయి బాబా ఆశీస్సులుతో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్. ఖమ్మం జిల్లా, మధిర మండలం, మాటూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు సత్య

Read More »

 Don't Miss this News !