+91 95819 05907

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

★ గ్రామపంచాయతీలకు సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా వారి జీతాలు చెల్లించాలి.

★ టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి,
తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి. ముత్తయ్య.

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని, గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా ప్రభుత్వమే వారి జీతాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, నేరుగా వారికి జీతాలు చెల్లించాలని టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి. ముత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టి యు సి ఐ అనుబంధ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం పినపాక మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఎంపీడీవోకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీ,చాలని వేతనాలతో, చెత్తా,చెదారం మధ్య పనిచేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి, వీధులను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. వారికి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా తక్కువ వేతనాలు చెల్లిస్తూ, ఆ వేతనాలు కూడా ప్రతినెలా చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారు అన్నారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా పెండింగ్ పెడితే వారు కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, గ్రామపంచాయతీ కార్మికుల వేతనాల కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించి ప్రభుత్వమే నేరుగా వారి జీతాలు చెల్లించాలని, పి ఆర్ సి సూచించిన వేతనాన్ని, వారి బేసిక్ వేతనంగా నిర్ణయించాలని, అప్పటివరకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, జీవో నెంబర్ 51 ను సవరించి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, వివిధ కేటగిరీలను యధావిధిగా కొనసాగించాలని,గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, ఇన్సూరెన్స్, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ కార్మికులకు 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, వారి స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ పినపాక మండల అధ్యక్ష, కార్యదర్శులు చంటి, రామకృష్ణ, నాయకులు దాసరి. రవి, నాగరాజు ఈసం. వెంకట్ నారాయణ, కొమరం. లక్ష్మయ్య, కొమరం. భాస్కర్, కోడిరెక్కల. తిరుపతి, బుజ్జి బాబు, సుమన్, కొమరం. వెంకటనారాయణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు *కాకులమర్రి లక్ష్మణ్ బాబు

నేటి గదర్ న్యూస్ ప్రతినిథి మంగపేట. మంగపేట మండలం లో వాడగూడెం మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు వాసం కృష్ణ మూర్తి గారి కుమారుడైన వాసం చరణ్ (16] ఇటీవలే మృతి చెందగా వారి

Read More »

ఏకలవ్య మోడల్ స్కూల్ లను నిర్విర్యం చేస్తున్న కేంద్రం ప్రభుత్వం: భూక్యా వీరభద్రం

గిరిజన ఆశ్రమ పాఠశాల అభివృద్ధి కి నిధులు కేటాయించాలి..‌‌.. కేంద్ర, రాష్ట్ర,ప్రభుత్వాలు బడ్జెట్ లో గిరిజనుల అభివృద్ధికి తగిన స్థాయిలో నిధులు కేటాయించాలి…. బెంగళూరు లో జరిగిన ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్( ఏ,

Read More »

ఆ పెట్రోల్ బంక్ కు అక్రమంగా ఇసుకను తోలారు.సీన్ కట్ చేస్తే…

★ ఇసుక అక్రమ నిలువలపై వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన యువకుడు ★ తక్షణమే స్పందించిన తహశీల్దార్ ★ ఇసుక సీజ్, జెసిబి స్వాధీనం ★ అక్రమ ఇసుక తోలకాలకు పాల్పడితే కఠిన

Read More »

నియోజకవర్గాల పునర్విభజన పై నేడు. అన్ని పార్టీలకు ఆహ్వానం, వేదిక ఖరారుపై చర్చ.

నియోజకవర్గాల పునర్విభజన పై నేడు. అన్ని పార్టీలకు ఆహ్వానం, వేదిక ఖరారుపై చర్చ. అందరికీ ఆమోదయోగ్యమైన వేదిక. సీనియర్ నేత జానా తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భేటీ. నేటి గదర్

Read More »

చెట్టు కింద కూర్చొని సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.

రైతన్నలతో కలిసి చెట్టు కింద కూర్చొని సమస్యలను అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. ఖమ్మం జిల్లా,చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో రైతుల పంటపొలాలకు సాగర్ నీళ్లు

Read More »

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

★ గ్రామపంచాయతీలకు సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా వారి జీతాలు చెల్లించాలి. ★ టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా

Read More »

 Don't Miss this News !