+91 95819 05907

15 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు తధ్యం:రామనాధం గౌడ్

— ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ
— రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారు
— పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సముద్రంలో కలవడం ఖాయం
— పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం గౌడ్

నేటి గద్ధర్ న్యూస్,పినపాక నియోజకవర్గ ప్రతినిధి ( పినపాక ):

ఆగస్టు 15 లోపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తాడని, రైతు బాంధవుడుగా చరిత్రలో నిలిచిపోతాడని, మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని… పినపాక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాథం అన్నారు. బుధవారం ఆయన బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేశారు.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలు ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్నాయని, ఎన్నికల అనంతరం మిగతా మిగిలిన హామీ కూడా అమలు చేస్తామని, ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేయాలో అర్థం కాక బస్సు యాత్ర పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావుల పదేళ్ల ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే చోటుచేసుకున్నాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగిస్తుందని, ఎన్నికల అనంతరం బిఆర్ఎస్ పార్టీని ప్రజలు సముద్రంలో కలుపుతారని అన్నారు. రాష్ట్రంలోనే అన్నింటికంటే మహబూబాబాద్ పార్లమెంట్లో రెండు లక్షల మెజారిటీతో అభ్యర్థి బలరాం నాయక్ ని గెలిపించి తీరుతామన్నారు. దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే నని స్పష్టం చేసారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !