+91 95819 05907

మధిర బహిరంగ సభకు భారీగా తరలిన బీజేపీ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్ , బోనకల్ : మధిర లో బిజెపి తలపెట్టిన బహిరంగ సభకు శనివారం మండల కేంద్రంనుండి బిజెపి శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. రావినూతల, ముష్టికుంట్ల, ఆళ్లపాడు, చిరునోముల గ్రామాల నుండి కార్యకర్తలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలారు. స్థానిక బిజెపి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు , సానుభూతిపరులు బిజెపి ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు విజయాన్ని కాంక్షిస్తూ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరరావు మాట్లాడుతూ మోడీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందని, ఖమ్మం జిల్లా విద్యా, వైద్యంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే బిజెపి ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావును భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ప్రజల విశ్వాసం కోల్పోయాయని విమర్శించారు. ప్రజలు బిజెపి వైపు ఉన్నారని, ఖమ్మంలో తాండ్ర వినోద్ రావు గెలుపుతో పాటు కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బహిరంగ సభకు తరలి వెళ్ళిన వారిలో బిజెపి ముఖ్య నాయకులు గంగుల నాగయ్య, యార్లగడ్డ రాఘవరావు,
జిడుగు వెంకటేశ్వర్లు,దొంతు రాధాకృష్ణ,శాస్త్రి మరీదు రామారావు తదితర ముఖ్య నాయకులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

 Don't Miss this News !