+91 95819 05907

మధిర బహిరంగ సభకు భారీగా తరలిన బీజేపీ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్ , బోనకల్ : మధిర లో బిజెపి తలపెట్టిన బహిరంగ సభకు శనివారం మండల కేంద్రంనుండి బిజెపి శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. రావినూతల, ముష్టికుంట్ల, ఆళ్లపాడు, చిరునోముల గ్రామాల నుండి కార్యకర్తలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలారు. స్థానిక బిజెపి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు , సానుభూతిపరులు బిజెపి ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు విజయాన్ని కాంక్షిస్తూ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరరావు మాట్లాడుతూ మోడీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందని, ఖమ్మం జిల్లా విద్యా, వైద్యంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే బిజెపి ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావును భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ప్రజల విశ్వాసం కోల్పోయాయని విమర్శించారు. ప్రజలు బిజెపి వైపు ఉన్నారని, ఖమ్మంలో తాండ్ర వినోద్ రావు గెలుపుతో పాటు కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బహిరంగ సభకు తరలి వెళ్ళిన వారిలో బిజెపి ముఖ్య నాయకులు గంగుల నాగయ్య, యార్లగడ్డ రాఘవరావు,
జిడుగు వెంకటేశ్వర్లు,దొంతు రాధాకృష్ణ,శాస్త్రి మరీదు రామారావు తదితర ముఖ్య నాయకులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !