మంత్రి జూపల్లి.కృష్ణారావును కలిసిన మాదిగ జేఏసీ బృందం…
యస్సి కార్పొరేషన్ తొలి చైర్మన్: డా పిడమర్తి రవి.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ మే 18:
హైదారాబాద్ డా బి ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లోని మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావును మర్యాద పూర్వకంగా తొలి యస్సి కార్పొరేషన్ చైర్మన్ మాదిగ జేఏసి వ్యవస్థాపకులు,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డా పిడమర్తి రవి కలిసి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించటానికి కృషి చేయాలని వినతి పత్రం అందజేశారు.మంత్రిని కలిసిన వారిలో మాదిగ రాజకీయ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఒక్కలగడ్డ చంద్రశేఖర్,మాదిగ జేఏసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోదుగు జోగారావు,మాదిగ జేఏసి రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిద్దెల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 122