+91 95819 05907

ప్రజలకు సేవ చేసేందుకు అధికార యంత్రాంగం

– ఎన్నో ఆశలతో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నా
– ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలి
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నేటి గదర్, జూన్ 11,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరవేసే విధంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలోని ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత మన పైన ఉందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం, పత్రికా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ… ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజా పాలన సక్రమంగా పరిపాలించడానికి ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందని, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడానికి విధులు నిర్వహిస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, త్రాగునీరు, విద్యా, వైద్యం, గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, కల్వర్టులు మీద ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అలాగే అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు, వితంతు మహిళలకు, ఒంటరి మహిళలకు, ఆసరా పింఛన్లు అందేలా చూడాలని తెలిపారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ్రామపంచాయతీలలో మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడి స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో ఏమైనా రిపేర్లు ఉంటే సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఇల్లందు నియోజకవర్గం శాసనసభ్యులు కోరం కనకయ్య, భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !