+91 95819 05907

గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల వేతనాలు తగ్గించే జీవో 64 ను రద్దు చేయాలి

◆గెజిట్ ప్రకారమే ప్రతి నెల 26 వేల వేతనం ఇవ్వాలి

●ఆశ్రమ పాఠశాల పనిచేసే డైలీ వేజ్ వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం పర్మినెంట్ చేయాలి

●డైలీ వేజ్ వర్కర్ల సమ్మెకు తెలంగాణ గిరిజన సంఘం మద్దతు :భూక్యా వీరభద్రం

నేటి గదర్ ప్రతినిధి, వైరా:

రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు వేతనాలు తగ్గించే జీవో 64 ను వెంటనే ప్రభుత్వం రద్దు చేసి గెజెడ్ ప్రకారమే కనీసం 26 వేల రూపాయలు వేతనం చెల్లించి డైలీ వేజ్ వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ గిరిజన సంఘం(TGS ) జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గతంలో 26 వేల రూపాయలు వేతనం ఇచ్చేదాన్ని కాదని జిఓ 64 ప్రకారం 11 వేల రూపాయలు వేతనం ఇస్తామంటే ఎలా కుదురుతుంది అని ప్రభుత్వానికి ప్రశ్నించారు. గతంలో రోజుకి 870 రూపాయలు చొప్పున ఇచ్చే వేతనాన్ని ఇప్పుడు రోజుకి 390 కి కుదించడం కార్మికుల శ్రమ దోపిడిని గురి చేయడమే అవుతుందని న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమ్మెకు తెలంగాణ గిరిజన సంఘం సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం స్పందించి హాస్టల్ లో పనిచేస్తున్న పేద గిరిజన కార్మికులకు న్యాయం చేసే విధంగా ఆలోచించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలో ఉన్న డైలీ వేస్ కార్మికులతో కలిసి ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే గిరిజన సంక్షేమ శాఖ ఉందని వెంటనే ముఖ్యమంత్రి స్పందించి డైలీ వేజ్ వర్కర్ యూనియన్ నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు. గిరిజన శాసనసభ్యులు ఈ సమస్యపై స్పందించాలని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తెలంగాణ బడ్జెట్ 2025-26 ఏ శాఖ కు ఎన్ని కోట్లు?

తెలంగాణ బడ్జెట్ 2025-26 ₹3,04,965 కోట్లు – మొత్తం వ్యయం ₹2,26,982 కోట్లు – రెవెన్యూ వ్యయం ₹36,504 కోట్లు – మూలధన వ్యయం కేటాయింపులు ₹40,232 కోట్లు – షెడ్యూల్డ్ కులాల సంక్షేమం

Read More »

తప్పిన ప్రమాదం…అదుపుతప్పి భారీ లారీ….

నేటి గదర్ న్యూస్, మణుగూరు మండలం రూరల్ : మణుగూరు మండలం రామానుజరం గ్రామ సమీపంలో,R&B రహదారిలో అదుపుతప్పి భారీ లారీ రోడ్డుపక్క గుంతలో పడింది. బ్రేకులు పడకపోవడం తో ఆ భారి వాహనం

Read More »

ఓ.సి 2 సైట్ దగ్గర ఉన్న బి యస్ ఎన్ ఎల్ సెల్ టవర్ సిగ్నల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి :నాగెళ్లి

★ ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెళ్లి నేటి గదర్ న్యూస్,మణుగూరు రూరల్: మణుగూరు సింగరేణి ఏరియా కొత్తగా ఏర్పాటు చేసిన ఓ సి 2 సైట్ అఫీస్

Read More »

రూ.3.30లక్షల కోట్లతో తెలంగాణ భారీ బడ్జెట్‌!

రూ.3.30లక్షల కోట్లతో తెలంగాణ భారీ బడ్జెట్‌! 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 3.30 లక్షల కోట్లతో బడ్జెట్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. ఓవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందన్న టాక్‌ వినిపిస్తోంది.

Read More »

నేటి నుండి ఘనంగా ప్రారంభం కానున్న గోవిందరాజు జాతర…పెద్ద ఎత్తున హాజరుకానున్న ★సనప★ వంశీయులు

*పెద్ద ఎత్తున హాజరుకానున్న సనప వంశీయులు* *నేటి గద్దర్ న్యూస్ గుండాల*, నేటి నుండి మూడు రోజులపాటు పెద్ద ఎత్తున గోవిందరాజు జాతర జరగనుంది. మండలం పరిధిలోని చెట్టుపల్లి గ్రామంలో సనప వారి ఇలవేల్పు

Read More »

కన్న బిడ్డను చంపేసిన కసాయి తల్లి

భర్త అనుమానిస్తున్నాడని కన్న బిడ్డను చంపేసిన కసాయి తల్లి విశాఖపట్నం పరిధి పెదగదిలి కొండవాలు ప్రాంతానికి చెందిన గొర్రె వెంకటరమణ, శిరీషలకు 2013లో పెళ్లైంది. ఐదు నెలల కిందట వీరికి ఒక పాప పుట్టింది

Read More »

 Don't Miss this News !