+91 95819 05907

మరణం లో వీడని భార్యాభర్తల బంధం భర్త చనిపోయిన కొన్ని గంటలకి భార్య మృతి

మరణం లో వీడని భార్యాభర్తల బంధం
భర్త చనిపోయిన కొన్ని గంటలకి భార్య మృతి
పినపాక లో విషాద ఛాయలు
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:కలకాలం తోడుంటానని పెళ్లి మండపంలో ఏడడుగులు సాక్షిగా ఒక్కటైన ఆ దంపతులు మరణంలోనూ భార్యాభర్తల బంధాన్ని వీడలేదు. అనారోగ్యంతో భర్త మృతిచెందగా, ఆ బాధను తట్టుకోలేక భార్య కొన్ని గంటల వ్యవధిలో మృతి చెందింది. ఈ హృదయవిదాకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో జరిగింది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక మండలం పినపాక చెందిన సుంకరి రాములు(80) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుని భార్య సుంకరి నర్సమ్మ(75) సైతం కొన్ని నెలలుగా అ నారోగ్యం మంచానికే పరిమితమై ఉన్నది. ఈ నేపథ్యంలో నరసమ్మ సైతం భర్త మృతి చెందిన కొన్ని గంటలకు సోమవారం రాత్రి మృతి చెందినట్లు నరసమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మృతుడు సుంకరి రాములు ఉమ్మడి పినపాక పంచాయతీకి రెండు పర్యాయాలు సర్పంచిగా సేవలందించారు. భార్యాభర్తలు ఒకే రోజు చనిపోవడంతో పినపాకలో విషాద ఛాయలు అలముకున్నాయి. 60 ఏళ్ల పాటు ఒకరినొకరు విడిచి ఉండలేని ఈ దంపతులు ఒకేరోజు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చివరకు చావులో కూడా ఒకటే అయ్యారని మృతుల బంధువులు ఆవేదన వెలిబుచ్చారు. మృతులకు దహన సంస్కారాలు మంగళవారం నిర్వహించనున్నారు. మృతులకు కొడుకు సుంకరి సాంబ ఉన్నారు. ఈ సంఘటన తెలిసిన వివిధ పార్టీల నాయకులు మృతుల పార్థివ దేహాలకు ఘన నివాళి అర్పించి మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !