మల్టీ వర్కర్స్ బతుకులు గాలిలో దీపాలేనా?
* పంచాయితీలు ఏర్పడిన నాటి నుండి ఇవే బతుకులు
* పాలకమండలి మారిన ప్రతిసారి ఉద్యోగాలు ఊస్ట్
* శ్రమ దోపిడి తప్ప వారి కష్టాలు పట్టని పాలకులు
* మంత్రి సీతక్క పై గంపెడు ఆశలు పెట్టుకున్న పంచాయతీ కార్మికులు
* మల్టీపర్పస్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసంIFTU అలుపెరగని పోరాటం
* మల్టీపర్పస్ వర్గాలను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి
*IFTU రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి రవి కుమార్
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం లోని పంచాయతీల లో వేకువజామున ప్రతి ఇంట్లో,పరిశరాల్లో సేకరించిన చెత్త ను పంచాయతీ మల్టీ పర్పస్ కార్మికులు ట్రాక్టర్లు ఇతర వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలిస్తూ ఉంటారు. గ్రామాలను శుభ్రంగా ఉంచడం,మొక్కలను సంరక్షించడంలో వారి పాత్ర ఏనలేనిది. కరోనా లాంటి కష్టకాలంలో వారు ప్రాణాలకు సైతం తెగించి కరోనా బాధ్యత కుటుంబాలకు విశేషమైన సేవలందించారు. అందరూ కష్టాలు తీర్చే వారి పరిస్థితి మాత్రం గాలిలో దీపాల వలేతయారయింది. పాలకులు మల్టీపర్పస్ వర్కర్ పేరుతో వారితో ఊడిగం చేయించుకుంటున్నారు తప్ప వారి పతికులకు మాత్రం ఎలాంటి భరోసా లేదు. నేటి గధర్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో 13 వేల పంచాయతీ లలో 60 వేల మల్టీ పర్పస్ కార్మికులను తాత్కాలిక పద్ధతిన ప్రభుత్వ నియమించింది. వారితో ఆయా పంచాయతీలకు సంబంధించిన వివిధ పనులకు వినియోగించడం జరుగుతుంది. ముఖ్యంగా చెత్త సేకరణ, మొక్కల పెంపకం, బ్లీచింగ్ నిర్వహణ తదితర పనులు వీరి ఆధ్వర్యంలో చేపడుతారు. ఇంతవరకు బాగానే ఉన్నా వారు పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా ఉంది. ఎప్పుడు వారి ఉద్యోగాలు ఉంటాయో? పోతాయో? తెలియని పరిస్థితి. పాలకమండలి మారిన ప్రతిసారి మల్టీపర్పస్ ఉద్యోగస్తులను అకారణంగా తొలగించడం జరుగుతుంది. ఆయా పాలక మండలికి అనువైన వ్యక్తులను తిరిగి నియమించుకుంటున్నారు. దీనితో వారికి మరల ఉపాధి దొరకడం కష్టంగా మారుతుంది. ఉన్న తాత్కాలిక కొలువు కోల్పోయి మరొకటి దొరకక వారి కుటుంబాలు వీధిపాలవుతున్నాయి. పంచాయతీలు ఏర్పడిన నాటి నుండి పంచాయతీ కార్మికుల పరిస్థితి ఇంతే. ఏ ఒక్క పాలకుడికి వీరి గోస పట్టలే. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోని శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగం కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల మల్టీ పర్పస్ కాంటాక్ట్ కార్మికులు కోరుతున్నారు. మంత్రి సీతక్క తవ కష్టాలు తీరుస్తుందని గంపెడు ఆశతో ఉన్నారు.
మల్టీపర్పస్ పంచాయతీ కార్మికుల ప్రధాన డిమాండ్లు:
1. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందిని మొత్తాన్ని పర్మినెంట్ చేయాలి.
2, పిఆర్సి లో నిర్ణయించిన మినిమం బేసిక్ ను వేతనంగా చెల్లించాలి, ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం స్లీపర్ లకు 15,600/_, బిల్ కలెక్టర్ ,కారోబర్లకు, 19500/_కంప్యూటర్ ఆఫ్టర్లకు 22,750/-వేతనంగా నిర్ణయించాలి.
3, గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలి, ఈ గ్రాంట్ నుండే వేతనాలు చెల్లించాలి.
4. 2011 జనాభా ప్రాతిపదికన కాకుండా అవసర ప్రతిపాదికన పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలి.
5, ప్రతి నెల రెగ్యులర్గా వేతనాలు చెల్లించాలి. పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి.
6, జీవో నెంబర్ 51ను సవరించాలి, మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి, వివిధ కేటగిరీలన్నింటిని కొనసాగించాలి.
7, కారాపూర్ బిల్లింగ్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి, వారికి పంచాయతీ అసిస్టెంట్ గా నామకరణం చేయాలి.
8, వర్కర్ కు ఇన్సూరెన్స్ రూ 5 లక్షలు అమలు చేయాలి. ప్రమాద బీమాగా రూ 10 లక్షలు ఇవ్వాలి, దహన సంస్కారాలకు 30000 ఇవ్వాలి.
9, వయసు మీరిందని సాకుతో కార్మికులను మారిస్తే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ గా ఐదు లక్షలు ఇవ్వాలి.
10, ఏడాదికి మూడు జతల యూనిఫాం,చెప్పులు, సబ్బులు, నూనెలు, ఇవ్వాలి. వాటికి నగదు రూపంలో అలవెన్సులు చెల్లించాలి.
11, పీఎఫ్,ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. 8 గంటల పనిని అమలు చేయాలి. ఆదివారం, పండుగ సెలవులు,జాతీయ, అంతర్జాతీయ సెలవు దినాలను అమలు చేయాలి.
12, కార్మికులపై రాజకీయ నాయకుల వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలి.
*మల్టీపర్పస్ వర్కర్ల సమస్య పరిష్కరించాలి: IFTU మల్టీ పర్పస్ వర్కర్ల రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి*
ఎన్నో బాధలు అనుభవిస్తూ గ్రామాల అభివృద్ధిలో మల్టీ పర్పస్ పంచాయతీ కార్మికులు అనేక సేవలు చేస్తున్నప్పటికీ వారిపట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని IFTU మల్టీ పర్పస్ వర్కర్ల రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి ఆవేదన వెలిబుచ్చారు. వారి డిమాండ్ పరిష్కారం అయ్యేంతవరకు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.