+91 95819 05907

CHERLA :. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి
*ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకొని అర్హులు మరల చేసుకునే అవకాశం
*రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతీ పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి
*చర్ల మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి అని , ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని చర్ల మండల కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ అన్నారు. ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన 80 రోజుల్లోనే నాలుగు పథకాలు అమలు చేసింది అని మిగిలిన రెండు గ్యారెంటీలో కూడా మరి కొద్ది రోజుల్లో అమలు చేస్తారని స్పష్టం చేశారు.ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని అందుకు అనుగుణంగా విధి విధానాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం హర్ష నియమన్నారు.ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా రాష్ట్రంలో గృహ జ్యోతి పథకం ,మహాలక్ష్మి పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఇతర మంత్రులు సమక్షంలో హైదరాబాద్ లో ప్రారంభించారు. ప్రజా పాలన కార్యక్రమంలో నమోదు చేసుకున్న అర్హులైన గృహం విద్యుత్ వియోగదారులకి మార్చి నెల నుండి 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ బిల్లు పథకం అమలు చేయబడుతుందని తెలిపారు ప్రజా పాలన కార్యక్రమంలో నమోదు చేసుకోగా మిగిలిపోయిన అభ్యర్థుల సైతం ఎవరైనా ఉంటే ఆ ధైర్య పడకుండా తమ అప్లికేషన్లకు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంటు మీటర్ బిల్లు జత చేసి ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని రసీదు తప్పక తీసుకోవాలని సూచించారు. Brs పార్టీ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తిన్నది అని అన్నారు ఆర్థిక పరిస్థితులు అనుకూలించనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతుందని ఆయన తెలిపారు
దేశంలో కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయని అయినప్పటికీ ఈ పెరిగిన ధరనుంచి సామాన్య మహిళలకు ఊరట కలిగించేందుకు గృహజ్యోతి పథకాన్ని ప్రకటించారు అని అన్నారు 500 కి గ్యాస్ సిలిండర్ ద్వారా రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు ఎటువంటి ఇబ్బందుల అయినా ఎదుర్కొని ప్రజా పాలన సాగిస్తుందని గిరిజన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే DSC ద్వారా 11,062 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులకు శుభసూచికం అని అన్నారు.ప్రతీ నెల ఒకటవ తారీకునే జీతాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు.భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి పది కోట్ల రూపాయలు మంజూరు చేసింది అని, కరకట్ట నిర్మాణం పనులు మొదలుపెట్టి భద్రాచలం వాసుల కష్టాలు తీరుస్తున్నది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో భద్రాచలం అభివృద్ధికి ఒక పైసా కూడా నిధులు మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు ఏది ఏమైనా సామాన్యులకి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి కాంగ్రెస్ ప్రభుత్వమే అని మరోసారి గుర్తు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !