+91 95819 05907

CHERLA :. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి
*ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకొని అర్హులు మరల చేసుకునే అవకాశం
*రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతీ పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి
*చర్ల మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి అని , ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని చర్ల మండల కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ అన్నారు. ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన 80 రోజుల్లోనే నాలుగు పథకాలు అమలు చేసింది అని మిగిలిన రెండు గ్యారెంటీలో కూడా మరి కొద్ది రోజుల్లో అమలు చేస్తారని స్పష్టం చేశారు.ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని అందుకు అనుగుణంగా విధి విధానాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం హర్ష నియమన్నారు.ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా రాష్ట్రంలో గృహ జ్యోతి పథకం ,మహాలక్ష్మి పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఇతర మంత్రులు సమక్షంలో హైదరాబాద్ లో ప్రారంభించారు. ప్రజా పాలన కార్యక్రమంలో నమోదు చేసుకున్న అర్హులైన గృహం విద్యుత్ వియోగదారులకి మార్చి నెల నుండి 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ బిల్లు పథకం అమలు చేయబడుతుందని తెలిపారు ప్రజా పాలన కార్యక్రమంలో నమోదు చేసుకోగా మిగిలిపోయిన అభ్యర్థుల సైతం ఎవరైనా ఉంటే ఆ ధైర్య పడకుండా తమ అప్లికేషన్లకు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంటు మీటర్ బిల్లు జత చేసి ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని రసీదు తప్పక తీసుకోవాలని సూచించారు. Brs పార్టీ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తిన్నది అని అన్నారు ఆర్థిక పరిస్థితులు అనుకూలించనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతుందని ఆయన తెలిపారు
దేశంలో కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయని అయినప్పటికీ ఈ పెరిగిన ధరనుంచి సామాన్య మహిళలకు ఊరట కలిగించేందుకు గృహజ్యోతి పథకాన్ని ప్రకటించారు అని అన్నారు 500 కి గ్యాస్ సిలిండర్ ద్వారా రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు ఎటువంటి ఇబ్బందుల అయినా ఎదుర్కొని ప్రజా పాలన సాగిస్తుందని గిరిజన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే DSC ద్వారా 11,062 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులకు శుభసూచికం అని అన్నారు.ప్రతీ నెల ఒకటవ తారీకునే జీతాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు.భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి పది కోట్ల రూపాయలు మంజూరు చేసింది అని, కరకట్ట నిర్మాణం పనులు మొదలుపెట్టి భద్రాచలం వాసుల కష్టాలు తీరుస్తున్నది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో భద్రాచలం అభివృద్ధికి ఒక పైసా కూడా నిధులు మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు ఏది ఏమైనా సామాన్యులకి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి కాంగ్రెస్ ప్రభుత్వమే అని మరోసారి గుర్తు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత… నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ముదిగొండలో పంచాయతీ ఎన్నికల వేళ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్

Read More »

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు రెండవ విడతలో 2,26,417 మంది తమ ఓటు హక్కు సద్వినియోగం కలెక్టరేట్ లోని

Read More »

ఖమ్మం నగరాభివృద్ధికి అంతర్జాతీయ ప్రమాణాలు..

ఖమ్మం నగరాభివృద్ధికి అంతర్జాతీయ ప్రమాణాలు.. * మంత్రి తుమ్మల కృషితో రూ.249 మంజూరు * రూ.90 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ నిర్మాణం మరియు రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం *

Read More »

కిలారు మనోహర్ కు సన్మానం.

కిలారు మనోహర్ కు సన్మానం. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: మండల కేంద్రం చింతకాని నూతన సర్పంచిగా ఎన్నికైన కిలారుమనోహర్ విజయోత్సవ సభలో పలువురు కిలారు మనోహర్ ను సన్మానించారు. కార్యక్రమంలో దిశ

Read More »

అగపేట సర్పంచ్ గా కొత్త యాకన్న గౌడ్ 105 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు ★★ 7 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ★తమ్ముడు సర్పంచ్, అక్క వార్డు మెంబర్ గా గెలుపు

అగపేట సర్పంచ్ గా కొత్త యాకన్న గౌడ్ భారీ మెజార్టీతో గెలుపు ★ 7 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ★తమ్ముడు సర్పంచ్, అక్క వార్డు మెంబర్ గా గెలుపు నేటి గదర్:దంతాలపల్లి

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత… నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ముదిగొండలో పంచాయతీ ఎన్నికల వేళ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్

Read More »

 Don't Miss this News !