+91 95819 05907

లుంగీ లో తహశీల్దార్?ఆ తర్వాత ఎం జరిగింది!

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: ఓ అతి సామాన్యమైన వ్యక్తి లా ఓ మండల తహశీల్దార్ బెల్ట్ షాపులోకి వెళ్లాడు… అది కూడా లుంగీ కట్టుకొని… పాత చొక్కా వేసుకొని ఎవరు గుర్తుపట్టని విధంగా బెల్ట్ షాప్ లోకి వెళ్ళాడు. ఆ బెల్ట్ షాప్ పై ఆకస్మికంగా దాడి చేసి హెచ్చరికలు జారీ చేశారు. దీనికి కారణం లేక పోలేదు. బాలికల వసతి గృహానికి దగ్గరగా ఆ బెల్ట్ షాపులు ఉండడమే కారణం. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి ప్రధాన రహదారి పక్కన బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులకి కొంత దూరంలోనే కస్తూరిబా గాంధీ విద్యాలయం(KGBV) ఉంది. బెల్ట్ షాప్ మూలంగా ఆ విద్యాలయంలో ఉన్న బాలికల చదువుకు అంతరాయం కలుగుతుందని పలుమార్లు బాలికల పేరెంట్స్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. ఈ నేపథ్యంలో కరకగూడెం మండల తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన కే. నాగప్రసాద్ ఆదివారం రాత్రి కస్తూరిబా గాంధీ విద్యాలయం,చిరమళ్ల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయా పాఠశాలల సమీపంలో బెల్ట్ షాపులు యదేచ్చగా అర్ధరాత్రి వరకు నడుస్తున్నాయని గమనించిన తాసిల్దార్ కే నాగప్రసాద్ ఆయా బెల్ట్ షాపులకు వెళ్లి రైడ్ నిర్వహించారు. బెల్ట్ షాపుల మూలంగా ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పడుతున్న అవస్థలను ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. వసతి గృహాల సమీపంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఒక తాసిల్దార్ ఎవరు గుర్తుపట్టని విధంగా సామాన్యమైన వ్యక్తుల వచ్చి వసతి గృహాలను తనిఖీ చేయడంతో పాటు వాటికి సమీపంలో ని బెల్ట్ షాపులపై కొరడా జులుపించిన తాసిల్దార్ కే నాగప్రసాద్ ను ఆయా ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు, మండల ప్రజలు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !