+91 95819 05907

KHAMMAM:పంతం ఎవరిది నెగ్గేనో?!

*సతి కోసం పతి…
* అనుచర గణంతో హైదరాబాదుకు 500కార్లతో భారీ ర్యాలీ తీసిన మల్లు నందిని

*సోదరుని కోసం సోదరుడు
* పొంగులేటి ప్రసాదరెడ్డిని ఏ ఐ సీ సీ హై కమాండ్ కు పరిచయం చేసిన మంత్రి శ్రీనివాసరెడ్డి
* ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచార స్పీడ్ పెంచిన ఆ ఇద్దరు
* హాట్ టాపిక్ గా ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ నియోజకవర్గం

నేటి గదర్ న్యూస్, ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం కాంగ్రెస్లో హీటెక్కింది .ఇద్దరు రాజకీయాలలో ఉద్దండులే. ఒకరు సతి కోసం టికెట్ ప్రయత్నాలు చేస్తుండగా మరొకరు సోదరుని కోసం టికెట్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో ఒకరు ఉప ముఖ్యమంత్రి,మంత్రి, మరొకరు మంత్రి కూడా. ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకే పార్లమెంట్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.ఆ ఇద్దరు కూడా ఒకే పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో చర్చనీయంగా మారింది. ఇద్దరి నేతల పోటీ పార్టీ హై కమాండ్ కు కూడ తలనొప్పిగా మారింది. నేటి గదర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధిప్రత్యేక కథనం. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం భారీ గానే డిమాండ్ఉంది. అన్ని విధాలుగా ఏ లోటు లేనిఆ ఇద్దరు నేతలు నాకంటే నాకే టికెట్ కావాలని పంతం పడుతున్నారు.వారే ఒకరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరొకరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కి ఎలాగైనా ఎంపీ టికెట్ ఇప్పించుకోవాలని ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. గత నెలలో తన అనుచరులతో మల్లు నందిని సుమారు 500 కార్లతో మధిర నియోజకవర్గం నుండి హైదరాబాద్ కు భారీగా ర్యాలీ తీసి ఎంపీ టికెట్ కావాలనే తన బలమైన కోరికను ఏఐ సి సి అధిష్టానానికి ప్రత్యేకంగా వ్యక్తపరిచారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఏఐసీసీ పెద్దలతో ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు ఉండడం, గత పది సంవత్సరాల కాలంలో కెసిఆర్ ప్రభుత్వం చే అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పాదయాత్ర సైతం నిర్వహించారు. భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది .ఈ క్రమంలో భట్టి వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందని వారి అనుచర గణం నూరు శాతం పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

*సోదరుడు పొంగులేటి ప్రసాద్ కొరకు మంత్రి శ్రీనివాస్ రెడ్డి పట్టు*
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బి ఆర్ ఎస్ అధిష్టానానికి సవాల్ విసిరిమరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 కాంగ్రెస్ సీట్లు గెలిపిస్తానని శబదం చేశారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి చాలెంజ్ విసిరిన విధంగానే భద్రాచలం మినహా అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి పట్టుబట్టి టికెట్ ఇప్పించిన ఆయన అనుచరులే భారీ మెజార్టీతో గెలిచారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా తన సోదరుడికి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి పొంగులేటికి మంచి సంబంధాలు ఉన్నట్లు వినికిడి. సీఎం రేవంత్ రెడ్డి ప్రసాదరెడ్డి వైపు మొగ్గు చూపుతారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నేపద్యంలోనే పొంగులేటి ప్రసాదరెడ్డి గత కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మమేకమవుతున్నారు. ఇద్దరి ఉద్దండులకు కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా సర్ది చెబుతారో, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి తగ్గుతుందో త్వరలోనే తేలనుంది. ఏ ఒక్కరికి సీటు దక్కిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల స్పందన ఎలా ఉంటుందో వెయిట్ చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !