+91 95819 05907

KHAMMAM:పంతం ఎవరిది నెగ్గేనో?!

*సతి కోసం పతి…
* అనుచర గణంతో హైదరాబాదుకు 500కార్లతో భారీ ర్యాలీ తీసిన మల్లు నందిని

*సోదరుని కోసం సోదరుడు
* పొంగులేటి ప్రసాదరెడ్డిని ఏ ఐ సీ సీ హై కమాండ్ కు పరిచయం చేసిన మంత్రి శ్రీనివాసరెడ్డి
* ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచార స్పీడ్ పెంచిన ఆ ఇద్దరు
* హాట్ టాపిక్ గా ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ నియోజకవర్గం

నేటి గదర్ న్యూస్, ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం కాంగ్రెస్లో హీటెక్కింది .ఇద్దరు రాజకీయాలలో ఉద్దండులే. ఒకరు సతి కోసం టికెట్ ప్రయత్నాలు చేస్తుండగా మరొకరు సోదరుని కోసం టికెట్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో ఒకరు ఉప ముఖ్యమంత్రి,మంత్రి, మరొకరు మంత్రి కూడా. ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకే పార్లమెంట్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.ఆ ఇద్దరు కూడా ఒకే పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో చర్చనీయంగా మారింది. ఇద్దరి నేతల పోటీ పార్టీ హై కమాండ్ కు కూడ తలనొప్పిగా మారింది. నేటి గదర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధిప్రత్యేక కథనం. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం భారీ గానే డిమాండ్ఉంది. అన్ని విధాలుగా ఏ లోటు లేనిఆ ఇద్దరు నేతలు నాకంటే నాకే టికెట్ కావాలని పంతం పడుతున్నారు.వారే ఒకరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరొకరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కి ఎలాగైనా ఎంపీ టికెట్ ఇప్పించుకోవాలని ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. గత నెలలో తన అనుచరులతో మల్లు నందిని సుమారు 500 కార్లతో మధిర నియోజకవర్గం నుండి హైదరాబాద్ కు భారీగా ర్యాలీ తీసి ఎంపీ టికెట్ కావాలనే తన బలమైన కోరికను ఏఐ సి సి అధిష్టానానికి ప్రత్యేకంగా వ్యక్తపరిచారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఏఐసీసీ పెద్దలతో ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు ఉండడం, గత పది సంవత్సరాల కాలంలో కెసిఆర్ ప్రభుత్వం చే అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పాదయాత్ర సైతం నిర్వహించారు. భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది .ఈ క్రమంలో భట్టి వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందని వారి అనుచర గణం నూరు శాతం పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

*సోదరుడు పొంగులేటి ప్రసాద్ కొరకు మంత్రి శ్రీనివాస్ రెడ్డి పట్టు*
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బి ఆర్ ఎస్ అధిష్టానానికి సవాల్ విసిరిమరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 కాంగ్రెస్ సీట్లు గెలిపిస్తానని శబదం చేశారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి చాలెంజ్ విసిరిన విధంగానే భద్రాచలం మినహా అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి పట్టుబట్టి టికెట్ ఇప్పించిన ఆయన అనుచరులే భారీ మెజార్టీతో గెలిచారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా తన సోదరుడికి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి పొంగులేటికి మంచి సంబంధాలు ఉన్నట్లు వినికిడి. సీఎం రేవంత్ రెడ్డి ప్రసాదరెడ్డి వైపు మొగ్గు చూపుతారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నేపద్యంలోనే పొంగులేటి ప్రసాదరెడ్డి గత కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మమేకమవుతున్నారు. ఇద్దరి ఉద్దండులకు కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా సర్ది చెబుతారో, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి తగ్గుతుందో త్వరలోనే తేలనుంది. ఏ ఒక్కరికి సీటు దక్కిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల స్పందన ఎలా ఉంటుందో వెయిట్ చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వినూతన ఆలోచనలు… అభివృద్ధిలో దూసుకుపోతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

*కలెక్టర్ నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెం అభివృద్ధి బాటలో…* *వివిధ రంగాల్లో మార్గదర్శకంగా నిలుస్తున్న కలెక్టర్ జితేష్ వి. పాటిల్.* *పాలనలో తనదైన శైలితో ఉత్తమంగా.. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ.. ప్రజలకు సేవలు అందిస్తున్న

Read More »

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

 Don't Miss this News !