+91 95819 05907

AP:తల్లిదండ్రులను కోట్టిన కొడుకు అరెస్ట్

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:ఆంద్రప్రదేశ్ రాష్ట్రం
బి.కొత్తకోట మండలం గుంతవారిపల్లెకు చెందిన పెద్దకాము లక్ష్మమ్మ, పెద్దకాము వెంకటరమణారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు ప్రస్తుతం మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె సమీపంలోని అయోధ్యనగర్‌లోని చిన్న కుమారుడు పి.శ్రీనివాసులురెడ్డి వద్ద ఉంటున్నారు.శ్రీనివాసులురెడ్డి స్థానికంగా చేనేత మగ్గం పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు సంపాదించిన అయిదు ఎకరాల భూమిని అన్నదమ్ములకు చెరో సగం రాసివ్వాలని నిందితుడు ఇబ్బంది పెడుతున్నాడు. సగం భూమి తన అధీనంలో ఉన్నా రికార్డుల పరంగా తన పేరున రాయించి ఇవ్వాలని కుమారుడు తల్లిదండ్రులపై ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంటివద్ద ఉన్న తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడి చేశాడు.మొదట కట్టెలతో తర్వాత చేతితో కొట్టి, కాళ్లతో తన్ని తీవ్రంగా గాయపరిచాడు. దీనిని గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు బాధితులను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం కర్నూలు రేంజ్‌ డీఐజీ, ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. ఇందులో టూటౌన్‌ సీఐ యువరాజ్‌, ఎస్సైలు ఇనయతుల్లా, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !