+91 95819 05907

WAZEDU: DPO పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.ఆ తర్వాత ఎం జరిగింది అంటే..

◆వాజేడు మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
◆త్రాగునీరు సమస్యపై ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం
◆డిపిఓ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
◆సమావేశం నుండి బయటకు వెళ్లిన డిపిఓ
నేటి గదర్ న్యూస్,వాజేడు:
ములుగు జిల్లా వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన తాగునీటి సరఫరా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ములుగు డిపిఓ స్వరూప పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఐఏఎస్ పేరు చెప్పి పంచాయతీ కార్యదర్శుల దగ్గర నుండి ముడుపులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని నీ పద్ధతి మార్చుకోకపోతే వేటు పడక తప్పదని హెచ్చరించారు.తక్షణమే ఈ సమావేశ హాల్ నుండి వెళ్లిపోవాలని ఆదేశించడంతో డిపిఓ స్వరూప బయటకు వెళ్లారని ప్రజలలో వినికిడి, పద్ధతి మార్చుకోకపోతే ఎంతటి ఎవరికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.
వాజేడు మండలంలో త్రాగు నీరు సమస్యపై దృష్టిసాదించిన కలెక్టర్ ఇలా త్రిపాటి. ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉన్న గ్రామాలలో పర్యటించారు.
మురుమూరు గ్రామపంచాయతీలో బిజినపల్లి గ్రామంలో, చెరుకూరు గ్రామపంచాయతీ శ్రీరామ్నగర్ గ్రామంలో పలు గ్రామాలలో త్రాగునీటి సమస్య ఉన్నందున త్రాగునీటి బోరు శాంక్షన్ చేశారని, తెలిపారు. భీమవరం,భువనపల్లి, గ్రామాలలో త్రాగునీటి సమస్య అధికంగా ఉన్నందున పైపులైను శాంక్షన్ చేశారని, ఇటీవల కాలంలో వైరల్ ఫీవర్ పట్టిపీడించాయని ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ, మిసిని భగీరథ డి ఈ, వాజేడు స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్, ఎంపీ ఓ శ్రీకాంత్ నాయుడు, మండల ఆధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !