+91 95819 05907

ఏజెన్సీలో అక్రమ నిర్మాణాలను కూల్చాలి.

ఎల్ టి ఆర్ చట్టం అధికారుల నిర్లక్ష్యంతో ఉల్లంఘన

1/70 చట్టం నేటికీ అమలుకు నోచుకోని వైనం

ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో వలస గిరిజనేతరులను నివారించాలి.

ఎల్ టి ఆర్, 1/59,1/70 చట్టాలను ధిక్కరిస్తున్న గిరిజనేతరులపై క్రిమినల్ కేసులు కట్టాలి.

చెరుకూరు గ్రామంలో నిర్మించిన అక్రమ బహులంతస్తులను కూల్చాలి.

నేటి గదర్ వాజేడు

ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసి చట్టాలకు వ్యతిరేకంగా అడ్డగోలుగా భూ క్రయ విక్రయాలు, అక్రమ నిర్మాణాలు, బహుళ అంతస్తులు, అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న, చట్టాన్ని రక్షించవలసిన అధికారులు మౌనం పాటిస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల భూములకు రక్షణగా ఎల్ టి ఆర్ చట్టం బ్రిటీష్ కాలం 1916 నుంచి ఉన్నప్పటికీ నేటికీ అమలుకు నోచుకోకపోగా, ఆదివాసి ప్రజల భూములు అన్యాక్రాంతం అవుతుందనేది వందకి 100% నిజం,
ఉన్నమాట అంటే ఉలుకు ఎక్కువ అన్నట్లు సంబంధిత అధికారులకు ఆదివాసీల సమస్యలు అంటేనే ఎగిరెగిరి పడుతుంటారు. చట్టం ఆదివాసులది చట్టాన్ని రక్షించవలసింది అధికారులు,
చట్టం ఉల్లంఘన జరుగుతుంటే బాధ్యత వహించవలసిన అధికారులు, మౌనం పాటిస్తున్నారు. ఇది అధికారుల తీరు.

వాజేడు ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలకు వ్యతిరేకంగా అనేక అక్రమ నిర్మాణాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, భూ క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయినా అధికారులు ముడుపులు తీసుకొని గిరిజనేతరుల అడుగులకు మడుగులోత్తుతున్న పరిస్థితులు వాజేడు మండలం చెరుకూరు గ్రామంలో జరుగుతుందని ఆరోపణలు లేకపోలేదు, ఆదివారం రాత్రి బహుళ అంతస్తు నిర్మాణం చేసుకునేందుకు ప్రయత్నించగా ఆదివాసి సంఘాల నాయకులు తాహాసిల్దార్ కు చేరవాణిలో మాట్లాడి బహుళ అంతస్తుల నిర్మాణాన్ని రాత్రి 12:30 వరకు నిలుపుదల చేశారు.అనంతరం ఎవరు లేని సమయంలో బహుళ అంతస్తు స్లాబ్ వేయడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యంతోనే బహులంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆదివాసి సంఘాల ఆరోపిస్తున్నాయి. వాజేడు మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఎం ఆర్ ఐ కు మంగళవారం ఎల్ టి ఆర్ కేసు నమోదు చేయాలని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని, వినతి పత్రం అందజేసినట్టు ఆదివాసి సంఘాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పాయం జానకి రమణ జిల్లా అధ్యక్షులు పట్టం జనార్ధన్ జిల్లా కార్యదర్శి సిద్దబోయిన సర్వేశ్వరరావు, కుచ్చింటి చిరంజీవి, గొండ్వాన సంక్షేమ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు చింత మోహన్, పేర్ల మల్లికార్జున్, బంధం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 6: అశ్వారావుపేట మున్సిపాలిటీ

Read More »

అశ్వారావుపేట గడ్డపై గులాబీ జెండా రెపరెప.. కాంగ్రెస్ ‘గడీల’ పాలనకు కాలం చెల్లింది!

​బెదిరింపులకు భయపడం.. 13వ వార్డులో సంకుల స్వరూప గెలుపు ఏకపక్షమే: బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ గర్జన నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 06: భద్రాద్రి కొత్తగూడెం

Read More »

అశ్వారావుపేటలో గులాబీ దండు ‘గర్జన’.. 14వ వార్డులో భుక్య ఉదయజ్యోతి గెలుపే లక్ష్యం!

​అమలుకాని హామీలిచ్చిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పండి: జిల్లా బీఆర్ఎస్ నేత సోయం వీరభద్రం పిలుపు నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి 6: అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా

Read More »

గుండాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఓ ఎస్ డి, ఎన్,నరేందర్

** *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల పోలీస్ స్టేషన్ ను కొత్తగూడెం ఓ ఎస్ డి ఎన్, నరేందర్ సందర్శించారు. సందర్శించిన ఆయన స్టేషన్ పరిసరాలు, రికార్డులు, మల్కన, స్టేషన్ డైరీ, స్టేషన్లోని

Read More »

సింథటిక్ ట్రాక్ నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలన.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో 8 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన సింథటిక్ రన్నింగ్ ట్రాక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్

Read More »

నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్

నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: నగరపాలక సంస్థ సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే

Read More »

 Don't Miss this News !