+91 95819 05907

ఏజెన్సీలో అక్రమ నిర్మాణాలను కూల్చాలి.

ఎల్ టి ఆర్ చట్టం అధికారుల నిర్లక్ష్యంతో ఉల్లంఘన

1/70 చట్టం నేటికీ అమలుకు నోచుకోని వైనం

ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో వలస గిరిజనేతరులను నివారించాలి.

ఎల్ టి ఆర్, 1/59,1/70 చట్టాలను ధిక్కరిస్తున్న గిరిజనేతరులపై క్రిమినల్ కేసులు కట్టాలి.

చెరుకూరు గ్రామంలో నిర్మించిన అక్రమ బహులంతస్తులను కూల్చాలి.

నేటి గదర్ వాజేడు

ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసి చట్టాలకు వ్యతిరేకంగా అడ్డగోలుగా భూ క్రయ విక్రయాలు, అక్రమ నిర్మాణాలు, బహుళ అంతస్తులు, అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న, చట్టాన్ని రక్షించవలసిన అధికారులు మౌనం పాటిస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల భూములకు రక్షణగా ఎల్ టి ఆర్ చట్టం బ్రిటీష్ కాలం 1916 నుంచి ఉన్నప్పటికీ నేటికీ అమలుకు నోచుకోకపోగా, ఆదివాసి ప్రజల భూములు అన్యాక్రాంతం అవుతుందనేది వందకి 100% నిజం,
ఉన్నమాట అంటే ఉలుకు ఎక్కువ అన్నట్లు సంబంధిత అధికారులకు ఆదివాసీల సమస్యలు అంటేనే ఎగిరెగిరి పడుతుంటారు. చట్టం ఆదివాసులది చట్టాన్ని రక్షించవలసింది అధికారులు,
చట్టం ఉల్లంఘన జరుగుతుంటే బాధ్యత వహించవలసిన అధికారులు, మౌనం పాటిస్తున్నారు. ఇది అధికారుల తీరు.

వాజేడు ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలకు వ్యతిరేకంగా అనేక అక్రమ నిర్మాణాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, భూ క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయినా అధికారులు ముడుపులు తీసుకొని గిరిజనేతరుల అడుగులకు మడుగులోత్తుతున్న పరిస్థితులు వాజేడు మండలం చెరుకూరు గ్రామంలో జరుగుతుందని ఆరోపణలు లేకపోలేదు, ఆదివారం రాత్రి బహుళ అంతస్తు నిర్మాణం చేసుకునేందుకు ప్రయత్నించగా ఆదివాసి సంఘాల నాయకులు తాహాసిల్దార్ కు చేరవాణిలో మాట్లాడి బహుళ అంతస్తుల నిర్మాణాన్ని రాత్రి 12:30 వరకు నిలుపుదల చేశారు.అనంతరం ఎవరు లేని సమయంలో బహుళ అంతస్తు స్లాబ్ వేయడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యంతోనే బహులంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆదివాసి సంఘాల ఆరోపిస్తున్నాయి. వాజేడు మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఎం ఆర్ ఐ కు మంగళవారం ఎల్ టి ఆర్ కేసు నమోదు చేయాలని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని, వినతి పత్రం అందజేసినట్టు ఆదివాసి సంఘాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పాయం జానకి రమణ జిల్లా అధ్యక్షులు పట్టం జనార్ధన్ జిల్లా కార్యదర్శి సిద్దబోయిన సర్వేశ్వరరావు, కుచ్చింటి చిరంజీవి, గొండ్వాన సంక్షేమ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు చింత మోహన్, పేర్ల మల్లికార్జున్, బంధం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !