+91 95819 05907

కాంగ్రెస్ 420 హామీలతో అధికారంలోకి వచ్చింది:Rega Kantharao

◆పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి
◆ ఎకరాకు రూ 25 వేలు నష్టపరిహారం చెల్లించాలి
◆ధాన్యానికి రూ. 500 బోనస్‌ హామీ నిలబెట్టుకోవాలి
◆ రైతు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాలి
◆ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో 209 మంది రైతుల ఆత్మహత్యలు
◆ ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికిరూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలి
◆మణుగూరులో నిరసన కార్యక్రమం
◆తహశీల్దార్ కి పలు డిమాండ్లతో వినతిపత్రం అందజేత
◆BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు Rega Kantha Rao

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

BRS జాతీయ కమిటీ పిలుపుమేరకు మణుగూరు మండల కేంద్రంలో శనివారం రైతుదీక్ష నిరసన కార్యక్రమం భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు ఆధ్వర్యంలో చేపట్టారు. అంబేద్కర్ సెంటర్లో మండుటెండలో బైఠాయించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేగా కాంతారావు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మణుగూరు తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ 420 హామీలు ఇచ్చి రైతులను ఇబ్బందికి గురి చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో రైతుభరోసా పేరిట కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్కహామీని నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చి 4 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయకపోగా, రైతులను ఇష్టారీతిగా అవమానాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుబంధు విడుదలలో జాప్యం, కరెంట్‌కోతలు, ధాన్యానికి రూ. 500 బోనస్‌ హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోవటమే కాకుండా కాంగ్రెస్‌ అనాలోచిత చర్యలతో 209 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ వివిధ మండలాల అధ్యక్షులు ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు యువజన నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !