◆పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి
◆ ఎకరాకు రూ 25 వేలు నష్టపరిహారం చెల్లించాలి
◆ధాన్యానికి రూ. 500 బోనస్ హామీ నిలబెట్టుకోవాలి
◆ రైతు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాలి
◆ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో 209 మంది రైతుల ఆత్మహత్యలు
◆ ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికిరూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలి
◆మణుగూరులో నిరసన కార్యక్రమం
◆తహశీల్దార్ కి పలు డిమాండ్లతో వినతిపత్రం అందజేత
◆BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు Rega Kantha Rao
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
BRS జాతీయ కమిటీ పిలుపుమేరకు మణుగూరు మండల కేంద్రంలో శనివారం రైతుదీక్ష నిరసన కార్యక్రమం భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు ఆధ్వర్యంలో చేపట్టారు. అంబేద్కర్ సెంటర్లో మండుటెండలో బైఠాయించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేగా కాంతారావు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మణుగూరు తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ 420 హామీలు ఇచ్చి రైతులను ఇబ్బందికి గురి చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో రైతుభరోసా పేరిట కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్కహామీని నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 4 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయకపోగా, రైతులను ఇష్టారీతిగా అవమానాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుబంధు విడుదలలో జాప్యం, కరెంట్కోతలు, ధాన్యానికి రూ. 500 బోనస్ హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోవటమే కాకుండా కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో 209 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ వివిధ మండలాల అధ్యక్షులు ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు యువజన నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.









