+91 95819 05907

క్రోధి నామ సంవత్సరంలో అంతా మంచి జరగాలి

– రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాస రెడ్డి
– శీనన్న చేతుల మీదుగా ధూప దీప నివేదన అర్చక సంఘ పంచాంగం ఆవిష్కరణ
– అర్చకుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఖమ్మం: తెలుగువారి కొత్త ఏడాది అయిన శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అంతా మంచి జరగాలని, రాష్ట్రంతో పాటు దేశం మంచి దిశగా పయనించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మంలోని ఎస్సార్ కన్వెన్షన్ లో జిల్లా ధూప, దీప నివేదన అర్చక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సర నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. శ్రీ క్రోధి ఏడాది రౌద్రావతారంలో ఉంటుందని పండితులు చెబుతున్నారని.. చల్లగా సాగాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
*సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా..*
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లి.. హైదరాబాదులో అర్చకులతో సమావేశం నిర్వహించి ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భగవంతుడికి, భక్తుడికి అనుసంధానకర్తగా ఉండే అర్చకులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని అభయం ఇచ్చారు. అందరూ ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అర్చకులు మంత్రి పొంగులేటిని సత్కరించారు.
*ఈ కార్యక్రమంలో..:* వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ కార్పోరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేత బొర్రా రాజశేఖర్, ధూప, దీప నివేదన అర్చక సంఘం జిల్లా అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ, కార్యదర్శి అన్నావజ్జుల ప్రసాద శర్మ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నం బొట్ల ఫణి కుమార శర్మ, కురుమేటి రామకృష్ణ శాస్త్రి, ఇంగువ సంగమేశ్వర శర్మ, నందుల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

 Don't Miss this News !