+91 95819 05907

క్రోధి నామ సంవత్సరంలో అంతా మంచి జరగాలి

– రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాస రెడ్డి
– శీనన్న చేతుల మీదుగా ధూప దీప నివేదన అర్చక సంఘ పంచాంగం ఆవిష్కరణ
– అర్చకుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఖమ్మం: తెలుగువారి కొత్త ఏడాది అయిన శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అంతా మంచి జరగాలని, రాష్ట్రంతో పాటు దేశం మంచి దిశగా పయనించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మంలోని ఎస్సార్ కన్వెన్షన్ లో జిల్లా ధూప, దీప నివేదన అర్చక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సర నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. శ్రీ క్రోధి ఏడాది రౌద్రావతారంలో ఉంటుందని పండితులు చెబుతున్నారని.. చల్లగా సాగాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
*సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా..*
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లి.. హైదరాబాదులో అర్చకులతో సమావేశం నిర్వహించి ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భగవంతుడికి, భక్తుడికి అనుసంధానకర్తగా ఉండే అర్చకులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని అభయం ఇచ్చారు. అందరూ ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అర్చకులు మంత్రి పొంగులేటిని సత్కరించారు.
*ఈ కార్యక్రమంలో..:* వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ కార్పోరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేత బొర్రా రాజశేఖర్, ధూప, దీప నివేదన అర్చక సంఘం జిల్లా అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ, కార్యదర్శి అన్నావజ్జుల ప్రసాద శర్మ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నం బొట్ల ఫణి కుమార శర్మ, కురుమేటి రామకృష్ణ శాస్త్రి, ఇంగువ సంగమేశ్వర శర్మ, నందుల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !