+91 95819 05907

జేఈఈ ఫలితాల్లో సత్తా చాటిన గిరి మాణిక్యాలు

– 22 మంది గిరిజన గురుకుల విద్యార్థులు ఎంపిక

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 25, భద్రాద్రి కొత్తగూడెం :

జేఈఈ ఫలితాల్లో గిరిజన గురుకులాల ఆణిముత్యాలు తమ సత్తా చాటుతూ విజయభేరి మోగించారు. ఇంటర్ మొత్తం 33 మంది బాలికలు పరీక్షకు హాజరైతే అనూహ్యంగా 22 మంది జేఈఈ అడ్వాన్స్ కు సెలెక్ట్ కావడం విశేషం. బుధవారం అర్ధరాత్రి విడుదల అయిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో భద్రాచలం గిరిజన బాలికలు సంచలన ఫలితాలు నమోదు చేయటం భద్రాచలం ఏజెన్సీకే గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చింది. భద్రాచలం గిరిజన గురుకులంలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివిన డి.ఐశ్వర్య 79.06, కే శ్రావణి 74.57, డి.నాగేశ్వరి 71.18, ఈ.స్వాంజిత 68.22, టి.సింధు 67.83, కె.వైష్ణవి 66.81,బి .స్నేహ 66.36, బి.అనిత 61.61, ఈ.రీతూ ప్రణయ 61.02, బి.హర్షిత 57.69, కె.చందన 55.27, అంజిత 55.16, బి.రేవతి 54.31, కె.పావని 53.03, బి.జాన్సీ 52.99, జి.సుమ లక్ష్మి 52.37, ఎం.సింధు శ్రీ 58.52, ఎస్.పుష్ప 52.18, బి.హరిణి 48.43, ఎస్.నవ్య శ్రీ 48.10, టి.నికిత 47.77, ఎస్.రూప శ్రీ 46.69 పర్సంటేజ్ సాధించారని భద్రాచలం గిరిజన గురుకులం కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు మాట్లాడుతూ… హైదరాబాద్ గురుకులం అధికారులు ప్రత్యేక శ్రద్ధ, మైక్రో షెడ్యూల్, వీకెండ్ పరీక్షలు, ప్రణాళిక బద్ధంగా ఆన్లైన్లో పరీక్షలకు సంబంధించి తగు సూచనలు సలహాలు, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ పర్యవేక్షణ, గిరిజన గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి తుమికి వెంకటేశ్వర రాజు సలహాలు, వీరికి తర్ఫీది ఇచ్చిన అధ్యాపకుల యొక్క కృషి, నాన్ టీచింగ్ స్టాప్ సహకారం బాలికలు జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ చాటే అందుకు దోహద పడిందని తెలిపారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !