+91 95819 05907

అయ్యో …పాపం..విద్యుత్ షాక్ గురైన ఉపాధి హామీ కూలీలు

నేటి గద్దర్, మే 01, ములుగు / భద్రాద్రి కొత్తగూడెం:

ఉపాధి హామీ కూలీలు విద్యుత్ షాక్ కి గురైన సంఘటన బుధవారం ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఉపాధి హామీ కూలీలు ఉదయం పని ముగించుకొని వస్తున్న క్రమంలో రాంనగర్ వద్ద ఉపాధి హామీ కూలీలు కూర్చున్న ట్రాక్టర్ కి, వారు పట్టుకొని ఉన్న గడ్డపారకి, ఆ ప్రాంతంలో కిందగా వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న కూలీలకు ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురైనారు. భయాందోళనలకు గురైన కూలీలు ట్రాక్టర్ నుండి దూకడం వలన శంకపల్లి సుగుణ అనే మహిళకు కాలు తీవ్ర గాయం అయినది. షాక్ గురైన బండి సారంగం, నీలం కల్పన, జవాజ్ కొమురమ్మ, మామిడి లక్ష్మి లను వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీలు అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. లేకపోతే షాక్ గురైన వారు అక్కడికక్కడే మృతి చెందేవారని స్థానికులు అంటున్నారు. ప్రమాదానికి గురైన శంకపల్లి సుగుణ మాట్లాడుతూ… పని చేసుకుంటే బ్రతికే వారమని ఈ ఘటన వల్ల నాకు పని లేకుండా అయిందని, మెరుగైన వైద్యం చేయించి ఆదుకోవాలని కోరారు. గ్రామస్తులు ఎన్నోసార్లు విద్యుత్ తీగల గురించి సంబంధిత అధికారులకు తెలియజేశామని, ఇప్పటికైనా గ్రామంలో కిందకు ఉన్న తీగలను తొలగించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !