+91 95819 05907

అయ్యో …పాపం..విద్యుత్ షాక్ గురైన ఉపాధి హామీ కూలీలు

నేటి గద్దర్, మే 01, ములుగు / భద్రాద్రి కొత్తగూడెం:

ఉపాధి హామీ కూలీలు విద్యుత్ షాక్ కి గురైన సంఘటన బుధవారం ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఉపాధి హామీ కూలీలు ఉదయం పని ముగించుకొని వస్తున్న క్రమంలో రాంనగర్ వద్ద ఉపాధి హామీ కూలీలు కూర్చున్న ట్రాక్టర్ కి, వారు పట్టుకొని ఉన్న గడ్డపారకి, ఆ ప్రాంతంలో కిందగా వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న కూలీలకు ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురైనారు. భయాందోళనలకు గురైన కూలీలు ట్రాక్టర్ నుండి దూకడం వలన శంకపల్లి సుగుణ అనే మహిళకు కాలు తీవ్ర గాయం అయినది. షాక్ గురైన బండి సారంగం, నీలం కల్పన, జవాజ్ కొమురమ్మ, మామిడి లక్ష్మి లను వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీలు అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. లేకపోతే షాక్ గురైన వారు అక్కడికక్కడే మృతి చెందేవారని స్థానికులు అంటున్నారు. ప్రమాదానికి గురైన శంకపల్లి సుగుణ మాట్లాడుతూ… పని చేసుకుంటే బ్రతికే వారమని ఈ ఘటన వల్ల నాకు పని లేకుండా అయిందని, మెరుగైన వైద్యం చేయించి ఆదుకోవాలని కోరారు. గ్రామస్తులు ఎన్నోసార్లు విద్యుత్ తీగల గురించి సంబంధిత అధికారులకు తెలియజేశామని, ఇప్పటికైనా గ్రామంలో కిందకు ఉన్న తీగలను తొలగించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !