+91 95819 05907

మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చెయ్యండి:SP

సైబర్ సెక్యూరిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ములుగు ఎస్పీ డా. శబరిష్ ఐపిఎస్

నేటి గద్దర్, మే 2, ములుగు / భద్రాద్రి కొత్తగూడెం :

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్థాపించబడింది. దీని నియంత్రణలో ప్రతి పోలీస్ కమిషనరేట్ ప్రతి జిల్లా కు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, జిల్లాలో సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా ఎస్ పి డా. శబరిష్ ఐపిఎస్ చేతుల మీదగా ములుగు డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేషన్ సెంటర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ నేరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వీరు జిల్లాలో వచ్చే సైబర్ కంప్లైంట్స్ ను పరిశీలన చేస్తారని తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇన్వెస్టిగేషన్ లో సహాయం అందిస్తారని, ములుగు జిల్లాలో ఎక్కువగా గ్రామీణ జనాభా ఉన్నందున సైబర్ క్రైమ్ మోసాలకు గురికాకుండా ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. అనుకోని విధంగా ఎవరైనా మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేసి కంప్లైంట్ ఇవ్వవలసిందిగా కోరారు. ములుగు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ నందు ఒక సైబర్ క్రైమ్ వారియర్ ని నియమించడం జరిగిందని వారిని సంప్రదిస్తే సహాయాన్ని అందిస్తారని, ఫోన్ ల లో వచ్చే ఎటువంటి లింక్ లను క్లిక్ చేయద్దని అపరిచిత వ్యక్తులకు బ్యాంకు సంబంధిత ఓటీపి, పాస్వర్డ్ వంటి సమాచారాన్ని తెలియచేయరాదని కోరారు. ఈ కో-ఆర్డినేషన్ సెంటర్ పర్యవేక్షణ అధికారిగా ఒక డిఎస్పి, ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు టెక్నికల్ స్టాఫ్ సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం, డి.ఎస్.పి సైబర్ క్రైమ్స్ సందీప్ రెడ్డి, డిఎస్పి డిసిఆర్బి రాములు, డి.ఎస్.పి ములుగు రవీందర్, సిఐ శ్రీధర్, సిఐ యాసిన్, సిఐ రంజిత్ కుమార్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !