+91 95819 05907

మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చెయ్యండి:SP

సైబర్ సెక్యూరిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ములుగు ఎస్పీ డా. శబరిష్ ఐపిఎస్

నేటి గద్దర్, మే 2, ములుగు / భద్రాద్రి కొత్తగూడెం :

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్థాపించబడింది. దీని నియంత్రణలో ప్రతి పోలీస్ కమిషనరేట్ ప్రతి జిల్లా కు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, జిల్లాలో సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా ఎస్ పి డా. శబరిష్ ఐపిఎస్ చేతుల మీదగా ములుగు డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేషన్ సెంటర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ నేరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వీరు జిల్లాలో వచ్చే సైబర్ కంప్లైంట్స్ ను పరిశీలన చేస్తారని తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇన్వెస్టిగేషన్ లో సహాయం అందిస్తారని, ములుగు జిల్లాలో ఎక్కువగా గ్రామీణ జనాభా ఉన్నందున సైబర్ క్రైమ్ మోసాలకు గురికాకుండా ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. అనుకోని విధంగా ఎవరైనా మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేసి కంప్లైంట్ ఇవ్వవలసిందిగా కోరారు. ములుగు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ నందు ఒక సైబర్ క్రైమ్ వారియర్ ని నియమించడం జరిగిందని వారిని సంప్రదిస్తే సహాయాన్ని అందిస్తారని, ఫోన్ ల లో వచ్చే ఎటువంటి లింక్ లను క్లిక్ చేయద్దని అపరిచిత వ్యక్తులకు బ్యాంకు సంబంధిత ఓటీపి, పాస్వర్డ్ వంటి సమాచారాన్ని తెలియచేయరాదని కోరారు. ఈ కో-ఆర్డినేషన్ సెంటర్ పర్యవేక్షణ అధికారిగా ఒక డిఎస్పి, ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు టెక్నికల్ స్టాఫ్ సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం, డి.ఎస్.పి సైబర్ క్రైమ్స్ సందీప్ రెడ్డి, డిఎస్పి డిసిఆర్బి రాములు, డి.ఎస్.పి ములుగు రవీందర్, సిఐ శ్రీధర్, సిఐ యాసిన్, సిఐ రంజిత్ కుమార్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !