+91 95819 05907

ఓటుకు నోటు కేసు లో CM రేవంత్ రెడ్డి అరెస్ట్ అవడం ఖాయం:REGA

★ఇప్పటికే గోసపడుతున్నాం.. మళ్ళీ మోసపోవద్దు
★ ఇచ్చంపల్లి జలాలు పక్క రాష్ర్టంలో కి తరలి వెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు
★ గోదావరి జలాలపై కేంద్రానికి హక్కులు కల్పించారు
★కొత్త జిల్లా లు తీసేస్తాం అంటున్నారు
★ బంధు పథకాలు బంద్ అయినాయి
★ వడగండ్ల వానతో రైతులు నష్టపోయిన ఈ ప్రభుత్వానికి సోయి లేదు
★ పోడు పట్టాల ఊసే లేదు
★KCR ని తిట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం చేతకావడం లేదు
★ ప్రజలు నమ్మడం లేదని ఓట్ల కోసం దేవుళ్లపై ఓట్లు
★ ఆరు గ్యారెంటీలు , 420 పథకాలను అమలు కోసం నిలదీయాలన్న BRS పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
★ భద్రాచలంలో విలేకరుల సమావేశంలో BRS పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:ఓటుకు నోటు కేసులు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో అరెస్ట్ అవడం ఖాయం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు జోస్యం చెప్పారు.శుక్రవారం భద్రాచలంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్పు కావాలి మార్పు కావాలి అని ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మూలంగా గత కొన్ని నెలల నుండి గోసపడుతున్నాం.. మళ్ళీ మోసపోవద్దు అని రేగ కాంతారావు ప్రజలను కోరారు. ఇచ్చంపల్లి జలాలు పక్క రాష్ర్టం కి తరలి వెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు.. నోరు మెదపడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోదావరి జలాలపై కేంద్రానికి హక్కులు కల్పించి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. పాలన అందరికీ దక్కాలని సదుద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే కొత్త జిల్లా లు తీసేస్తాం అని కాంగ్రెస్ పాలకులు మాట్లాడడం ఎంతవరకు న్యాయమన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన బంధు పథకాలు కొద్ది నెలల్లోనే
బంద్ అయినాయి అని అన్నారు. వడగండ్ల వానతో రైతులు నష్టపోయిన ఈ ప్రభుత్వానికి సోయి లేదు.పోడు పట్టాల ఊసే లేదు. పాలన చేతకాక KCR ని తిట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం చేతకావడం లేదు అని ప్రభుత్వ పనితీరును దుయ్యబట్టారు. ప్రజలు నమ్మడం లేదని ఓట్ల కోసం దేవుళ్లపై ఓట్లు ఓట్లు వేయడం సిగ్గుమాలిన చర్యగా వర్ణించారు. ప్రజలకు ఎన్నికల హామీలో భాగంగా అమలు గాని హామీలు గుప్పిచ్చారని…
ఆరు గ్యారెంటీలు , 420 పథకాలను అమలు కోసం నిలదీయాలన్న BRS పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు మహబూబాద్ ఎంపీ మాలోత్ కవితను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వట్టం రాంబాబు దొర, భద్రాచలం నియోజకవర్గం నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !