+91 95819 05907

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడు బి ఆర్ ఎస్ ను ఆదరించలేదు:CM రేవంత్ రెడ్డి

అధిక మెజారిటీ ఇచ్చే స్థానంగా ఖమ్మం చరిత్రలో నిలుస్తుంది
– ఖమ్మం ప్రజలు కాలకూట విషాన్ని ముందే గుర్తించారు
– అందుకే 2014, 19, 23 ఎన్నికల్లో బిఆర్ఎస్ దూరం పెట్టారు
– నమ్మించి మోసం చేయడంలో కేసీఆర్ ని మించినోడు లేడు
– డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్… మే 13న జరగనున్న ఎన్నికలు ఫైనల్స్
– జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి

నేటి గదర్, మే 04, భద్రాద్రి కొత్తగూడెం :

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అధిక మెజారిటీ ఇచ్చే స్థానంగా ఖమ్మం జిల్లా చరిత్రలో నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన జన జాతర మహాసభలో వేలాదిమంది కార్యకర్తలు పాల్గొనగా సభకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తదితర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాకు పోరాటాల గడ్డగా పేరుందని, ఆనాడు 1969లో తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లా పాల్వంచ ప్రాంతంలో మొదలైంది అన్నారు. ఖమ్మం ప్రజల ప్రారంభించిన పోరాటం వల్లన తెలంగాణ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నక్కజిత్తుల, నయవంచన, కాలకూట విషం కేసీఆర్ వైఖరిని ఖమ్మం ప్రజలు ముందే పసిగట్టారు అని సీఎం రేవంత్ అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని జరగనున్న మార్పులను ముందే అంచనా వేయగలరని, అందుకే 2014, 19, 23 ఎన్నికల్లో బిఆర్ఎస్ ను దూరం పెట్టారని ఆయన తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిచే స్థానంగా ఖమ్మం చరిత్రలో నిలబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఈ రోజున గూడుపుఠాణి జరుగుతుందని, అంతర్గతంగా ఒక అవగాహనతో కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకోవాలని బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రను తిప్పి కొట్టాల్సిన బాధ్యత ఖమ్మం, మహబూబాబాద్ కార్యకర్తలపై ఉందని ఆయన అన్నారు. కారు కార్ఖానాకు పోయింది.. మళ్లీ వస్తుంది అని కేసీఆర్ చెప్తున్నారు కానీ, కారు కరాబ్ అయిందని.. తూకానికి తెగనమ్మాల్సిన సమయం వచ్చిందని రేవంత్ అన్నారు. నమ్మించి మోసం చేయడంలో కెసిఆర్ ను మించిన వాళ్లు లేరని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ బిజెపిలో చేరుతారని మేము మొదటి నుంచి చెబుతున్నామని, కెసిఆర్ కేంద్రంలో ఏ సంకీర్ణంలో చేరుతారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో భాజాపా చేసిన అన్ని చట్టాలకు బారాస మద్దతు ఇచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బిజెపికి కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమని ఆయన అన్నారు. 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని మాకు ఇచ్చారని సీఎం రేవంత్ అన్నారు. బట్టి విక్రమార్క గట్టి వ్యక్తి కాబట్టి నిధులు సర్దుతున్నారని, అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీని జీతాలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా ఆగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని, ఈనెల 9లోగా ఒక రైతుకైనా బకాయి ఉంటే క్షమాపణ చెబుతానన్నారు రేవంత్ రెడ్డి. రైతులకు బకాయి లేకపోతే ముక్కు నేలకు రాస్తావా కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. భద్రాచలం రాముల వారి సాక్షిగా పంద్రాగస్టు నాటికి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానన్నారు. పంద్రాగస్టులోగా రుణమాఫీ అమలు చేసి, హరీష్ రావు నోరు మూయిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా, కరెంటు కోతలు, పింఛన్లపై అబద్దాలు చెప్తున్నారు అని రేవంత్ మండపడ్డారు. రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అని రేవంత్ తెలిపారు. బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుందని, రిజర్వేషన్లు రద్దు అవుతాయని రేవంత్ ఆరోపించారు. బిజెపికి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని, కాంగ్రెస్కు ఓటు వేస్తే రిజర్వేషన్లు ఇంకా పెరుగుతాయని రేవంత్ అన్నారు. బిజెపికి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై పోటుగా మారుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు కేవలం సెమీఫైనల్స్, మే 13న జరగనున్న ఎన్నికలు ఫైనల్స్ అని రేవంత్ అన్నారు. ఆ ఫైనల్స్ లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం ఉంటుందని, గుజరాత్ టీంకు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే… తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ నాయకత్వం వహించబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గుజరాత్ ను ఓడిద్దాం తెలంగాణను గెలిపిద్దాం రండి అంటూ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఖమ్మంలో రఘురాంరెడ్డిని, మహబూబాబాద్ లో బలరాం నాయక్ ని గెలిపించాలని ఆయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !