+91 95819 05907

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడు బి ఆర్ ఎస్ ను ఆదరించలేదు:CM రేవంత్ రెడ్డి

అధిక మెజారిటీ ఇచ్చే స్థానంగా ఖమ్మం చరిత్రలో నిలుస్తుంది
– ఖమ్మం ప్రజలు కాలకూట విషాన్ని ముందే గుర్తించారు
– అందుకే 2014, 19, 23 ఎన్నికల్లో బిఆర్ఎస్ దూరం పెట్టారు
– నమ్మించి మోసం చేయడంలో కేసీఆర్ ని మించినోడు లేడు
– డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్… మే 13న జరగనున్న ఎన్నికలు ఫైనల్స్
– జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి

నేటి గదర్, మే 04, భద్రాద్రి కొత్తగూడెం :

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అధిక మెజారిటీ ఇచ్చే స్థానంగా ఖమ్మం జిల్లా చరిత్రలో నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన జన జాతర మహాసభలో వేలాదిమంది కార్యకర్తలు పాల్గొనగా సభకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తదితర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాకు పోరాటాల గడ్డగా పేరుందని, ఆనాడు 1969లో తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లా పాల్వంచ ప్రాంతంలో మొదలైంది అన్నారు. ఖమ్మం ప్రజల ప్రారంభించిన పోరాటం వల్లన తెలంగాణ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నక్కజిత్తుల, నయవంచన, కాలకూట విషం కేసీఆర్ వైఖరిని ఖమ్మం ప్రజలు ముందే పసిగట్టారు అని సీఎం రేవంత్ అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని జరగనున్న మార్పులను ముందే అంచనా వేయగలరని, అందుకే 2014, 19, 23 ఎన్నికల్లో బిఆర్ఎస్ ను దూరం పెట్టారని ఆయన తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిచే స్థానంగా ఖమ్మం చరిత్రలో నిలబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఈ రోజున గూడుపుఠాణి జరుగుతుందని, అంతర్గతంగా ఒక అవగాహనతో కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకోవాలని బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రను తిప్పి కొట్టాల్సిన బాధ్యత ఖమ్మం, మహబూబాబాద్ కార్యకర్తలపై ఉందని ఆయన అన్నారు. కారు కార్ఖానాకు పోయింది.. మళ్లీ వస్తుంది అని కేసీఆర్ చెప్తున్నారు కానీ, కారు కరాబ్ అయిందని.. తూకానికి తెగనమ్మాల్సిన సమయం వచ్చిందని రేవంత్ అన్నారు. నమ్మించి మోసం చేయడంలో కెసిఆర్ ను మించిన వాళ్లు లేరని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ బిజెపిలో చేరుతారని మేము మొదటి నుంచి చెబుతున్నామని, కెసిఆర్ కేంద్రంలో ఏ సంకీర్ణంలో చేరుతారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో భాజాపా చేసిన అన్ని చట్టాలకు బారాస మద్దతు ఇచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బిజెపికి కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమని ఆయన అన్నారు. 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని మాకు ఇచ్చారని సీఎం రేవంత్ అన్నారు. బట్టి విక్రమార్క గట్టి వ్యక్తి కాబట్టి నిధులు సర్దుతున్నారని, అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీని జీతాలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా ఆగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని, ఈనెల 9లోగా ఒక రైతుకైనా బకాయి ఉంటే క్షమాపణ చెబుతానన్నారు రేవంత్ రెడ్డి. రైతులకు బకాయి లేకపోతే ముక్కు నేలకు రాస్తావా కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. భద్రాచలం రాముల వారి సాక్షిగా పంద్రాగస్టు నాటికి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానన్నారు. పంద్రాగస్టులోగా రుణమాఫీ అమలు చేసి, హరీష్ రావు నోరు మూయిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా, కరెంటు కోతలు, పింఛన్లపై అబద్దాలు చెప్తున్నారు అని రేవంత్ మండపడ్డారు. రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అని రేవంత్ తెలిపారు. బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుందని, రిజర్వేషన్లు రద్దు అవుతాయని రేవంత్ ఆరోపించారు. బిజెపికి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని, కాంగ్రెస్కు ఓటు వేస్తే రిజర్వేషన్లు ఇంకా పెరుగుతాయని రేవంత్ అన్నారు. బిజెపికి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై పోటుగా మారుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు కేవలం సెమీఫైనల్స్, మే 13న జరగనున్న ఎన్నికలు ఫైనల్స్ అని రేవంత్ అన్నారు. ఆ ఫైనల్స్ లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం ఉంటుందని, గుజరాత్ టీంకు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే… తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ నాయకత్వం వహించబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గుజరాత్ ను ఓడిద్దాం తెలంగాణను గెలిపిద్దాం రండి అంటూ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఖమ్మంలో రఘురాంరెడ్డిని, మహబూబాబాద్ లో బలరాం నాయక్ ని గెలిపించాలని ఆయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !