+91 95819 05907

హత్యలకు,ఘర్షణ లకు కేంద్రం గా మద్యం బెల్ట్ షాపులు.

విచ్చలవిడిగా బెల్ట్ షాపులు…

★..

★బెల్ట్ షాప్ ల వద్ద తీవ్ర ఘర్షణలు జరుగుతున్న ఎక్సైజ్ శాఖకి పట్టదా?
★మద్యం బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి:యాదగిరి గౌడ్, BRS నాయకులు, మణుగూరు
★చర్యలు తీసుకుంటాం:Excise CI రాజీ రెడ్డి

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి (మే 7)(మణుగూరు):
నైనారపు నాగేశ్వరరావు ✍️
7893538668

ఏజెన్సీలో మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడిపించడం వలన అనేక మంది మరణాలకు నిలయంగా బెల్ట్ షాపులు ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉండడం వలన అనేక మంది మరణాలకు,హత్యలకు నిలయాలుగా ఉండడం వలన మందు బాబుల ఘర్షణలకు కారణమౌతున్నాయని పలువురు రాజకీయ నాయకులు మేధావులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.గత కొంత కాలం క్రితం మణుగూరు మండలంలోని మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్లో మద్యం మత్తులో ఒకరికి ఒకరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు ఏర్పడి అదే గాంధీ బొమ్మ సెంటర్లో ఇండ్లను తగల బెట్టుకోవడం జరిగిన సంఘటనలు ఉన్నాయని దాని వలన పలు కుటుంబాలు వీధిన పడి జైళ్ళ పాలు అయినటువంటి సంఘటనలు ఉన్నాయని పలు రాజకీయ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.అదే కాకుండా మణుగూరు పీకే వన్ సెంటర్లో ఈ నెల 5న మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో అక్కడే ఉన్న బెల్ట్ షాప్ ముందు హత్యాయత్నం జరిగిన సంఘటన అనంతరం మండల ప్రజానీకం మహిళలు యువతు లు భయభ్రాంతులకు గురవుతున్నారు.ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం సిండికేట్ వ్యాపారులను ప్రోత్సహించడం వలన ఏజెన్సీ ప్రాంతంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిలుస్తున్నాయని వాటి వలన మద్యానికి బానిసైన మందుబాబుల కుటుంబాలు చిన్నాభిన్నమై పలు కుటుంబాలు వీధిన పడుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.రెక్కాడితే గాని డొక్కాడని వందలాది పేద కుటుంబాలు వీధిన పడడమే కాకుండా,హత్యలు,హత్యా యత్నాలు,ఘర్షణలు జరగడానికి కారకులు మద్యం సిండికేట్ యాజమాన్యాలేనని వారి హత్యలకు పూర్తి బాధ్యత ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు సిండికేట్ యాజమాన్యాలే బాధ్యత వహించాలని పలు మహిళా సంఘాల నాయకురాలు,బాధిత మహిళలల కుటుంబాల వారు,రాజకీయ పార్టీల నాయకులు,మేధావులు డిమాండ్ చేస్తున్నారు.మరోపక్క పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో బెల్ట్ షాపులు బందు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యహరించడం పట్ల పలువురు మండిపడుతున్నారు.ఎక్సైజ్ శాఖ అధికారులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని రాజకీయ పార్టీల నాయకులు మేధావులు సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారుల పట్ల విమర్శనాస్త్రాలు సిద్ధిస్తున్నారు.ఎక్సైజ్ శాఖ అధికారులు సిండికేట్లతో కుమ్మక్కై వారిచ్చే కాసులకి కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని పలువురు మండిపడుతున్నారు.

💥💥💥💥💥💥💥💥
మద్యం బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాలి:బిఆర్ఎస్ మణుగూరు పట్టణ సీనియర్ నాయకులు:తాళ్లపల్లి యాదగిరి గౌడ్.

మణుగూరు పట్టణంలో మద్యం బెల్టు షాపులు విచ్చలవిడిగా నడిపిస్తున్నారని వాటి వలన ప్రజలు మద్యం సేవించే వారు ఆనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని పికే 1 సెంటర్లో ఘర్షణలకు దారితీస్తుందని,పేదల కష్టార్జితాన్ని మద్యం బెల్టు షాపుల యాజమాన్యాలు కొల్లగొడుతూన్నారని మండిపడ్డారు.పికే 1 సెంటర్లో ఉన్న బెల్టు షాపులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.బెల్టు షాపులను ప్రోత్సహించే ఎక్సైజ్ శాఖ అధికారులపై, సిండికేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
💥💥💥💥💥💥💥💥
మణుగూరు Excise CI రాజీ రెడ్డిని నేటి గద్ధర్ న్యూస్ ప్రతినిధి ఫోన్ కాల్ లో సంప్రదించగా మణుగూరు మండలంలో అన్ని బెల్ట్ షాపులు మూసి వేయడం జరిగిందని, బెల్టు షాపుల నిర్వాహకులపై బైండోవర్ కేసులు పెట్టడం జరిగిందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్మిన, అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి

Read More »

రైతుల భూములను భరోసా కల్పించే చట్టం భూ భారతి చట్టం… జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ

నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి, రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. *గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ చింతకాని మండలం నాగులవంచ

Read More »

నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై..ఆశీర్వదించిన జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు& ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు.మడుపల్లి భాస్కర్.

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, ఈరోజు ఖమ్మం పట్టణంలోని R R R. ఫంక్షన్ హాల్ నందు …చింతకాని చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ *దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మేనకోడలు వేమూరి

Read More »

కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ, నిరసన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో మల్కరం వెళ్లే జంక్షన్ (రవి మెడికల్స్) ఎదురుగా మేము సైతం ఫౌండేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన

Read More »

చలో వరంగల్, సైకిల్ పై ప్రచార యాత్ర నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: ఈనెల 27 న వరంగల్ లో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ, ను జయప్రదం చేయాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించిన భద్రాద్రి

Read More »

ఈనెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుంది

. గజ్వేల్ మండల్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి చిట్యాల ఎల్లం. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 24. వరంగల్ లో ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే రజోత్సవ

Read More »

 Don't Miss this News !