+91 95819 05907

పార్లమెంటులో తెలంగాణ గొంతుక వినిపించాలంటే మాలోత్ కవిత ని గెలిపించాలి – మణుగూర్ ZPTC పొశం

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:
మణుగూరు మండలం గుట్టమల్లారం, సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల ఉపాధి కూలీలతో మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రo అభివృద్ధి చెందాలంటే పార్లమెంటులో మన అభ్యర్థిలు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి కాంగ్రెస్కి ఓటు వేస్తే అభివృద్ధి శూన్యమని తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి నెట్టి వేయబడుతుందని అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కోతులు, మంచినీటి సమస్యలతో మరియు సరైన టైంలో వికలాంగులకు, వృద్ధులకు వితంతువులకు మరియు ఒంటరి మహిళలకు పింఛన్లు వెయ్యక పోవడంతో వాటిపై ఆధారపడిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, మీరు కూడా రైతు కూలీలు కదా మీకు ఎన్నికల హామీలో ఇచ్చిన రేవంత్ రెడ్డి 12000 రూపాయలు మీ ఎకౌంట్లో జమ అయినయా, కెసిఆర్ బస్సు యాత్రలో ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టి ఎన్ని ఎకరాలకి పట్టా ఉంటే అన్ని ఎకరాలకు రైతుబంధు ఇస్తానని చెప్పి గతంలో కేసీఆర్ ఇచ్చే ఎకరానికి 10000 తప్ప అదనంగా ఒక్క పైసా కూడా ఇచ్చినారా, రైతులందరూ ఒకసారి ఆలోచన చేయండి, కేసీఆర్ తోనే రైతులకి న్యాయం జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రైతులకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు.ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఈ ఎన్నికల్లో ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు సీట్లను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారని అన్నారు,
కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత
కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఎన్నికల ప్రచారంలో గుట్టమల్లారం మాజీ సర్పంచ్ కారం ముత్తయ్య, ఎనిక ప్రసాద్, మాజీ ఎంపీటీసీలు వల్లభనేని రమణ,కొండ్రు మల్లేష్, మేకల రవి, మండల కో ఆప్షన్స్ జావిద్, మండల ప్రధాన కార్యదర్శి రామిడి రాoరెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు రామసహాయం వెంకటరెడ్డి, మండల నాయకులు మడి వీరన్నబాబు కంభంపాటి శ్రీను,బుద్దుల ప్రసాద్ పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 2

Read More »

భూదాన్ నిర్వాసితులను ఇండ్లలోకి పంపే వరకు పోరాటం చేస్తాం*

తుమ్మల , శ్రీనివాస్ రెడ్డి , భట్టి పేదల పక్షమే అంటే మా పోరాటం లో భాగస్వామ్యం కావాలి.* *బీసీ , ఎస్సీ , ఎస్టీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ విషాదారన్ మహరాజ్* నేటి

Read More »

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు ​యుద్ధ మేఘాల నేపథ్యంలో నాయకుడు క్షేమంగా రావాలని ఆకాంక్ష నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 03: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ

Read More »

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

 Don't Miss this News !