+91 95819 05907

ఒక్క కేసీఆర్ బస్సు యాత్ర తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది ప్రజల సమస్యల పరిష్కారానికి బాట వేసింది – మణుగూరు జెడ్పిటిసి పోశం నరసింహారావు

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:

మణుగూరు మండలం కట్టుమల్లారం గ్రామo మరియు తొగ్గూడెం గ్రామo సమావేశంలో మాట్లాడుతూ..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ ఐదు నెలలకే రేవంత్ రెడ్డికి ప్రజల నుండి తిరుగుబాటు ప్రారంభమైందని అన్నారు.
ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని పథకాలు సరైన టైంలో ప్రజలకు చేరేవని, కళ్లిబోళ్లు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూ, ఉన్న పథకాలను కూడా సరైన టైమ్ లో ఇవ్వకుండా పెన్షన్లు ఒక నెల రెండు నెలలు తప్పించి ఇస్తున్నారని ప్రజలు చెప్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పైగా పోలీస్, ఏఎన్ఎం, జిఎన్ఎం, ఫారెస్ట్, సింగరేణి, టీచర్స్ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజంగాదా, రాష్ట్రవ్యాప్తంగా 1200 వందల కు పైగా గ్రామపంచాయతీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏర్పాటుచేసి నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించింది నిజం కాదా ! అందులో అదనంగా ఉద్యోగ నియమకాలు చేపట్టింది నిజంకాదా .12731 తండాలను గిరిజన గ్రామాలను గ్రామపంచాయతీలు గా ఏర్పాటుచేసి జూనియర్ కార్యదర్శులు నియమించి వారిని పేర్మినెంట్ చేయలేదా!!
అందులో పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి నెలకు 8,500 జీతం ఇచ్చింది నిజం కాదా.పవర్ ప్రాజెక్ట్ బీటీపీస్ లో 300 పైగా ఉద్యోగాలు కల్పించింది నిజం కాదా.సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలతోపాటు, కారుణ్య నియామకాలు మరియు 700 పైగా బదిలీ వర్కర్స్ ఉద్యోగ నియమాకాలు చేపట్టలేదా.
కెసిఆర్ ప్రభుత్వంలో చేపట్టిన 26వేల ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చింది నిజం కాదా?పినపాక నియోజకవర్గం లోని 16800 పోడు భూముల సాగుదారులకు 56000 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చి వాటికి రైతుబంధు, రైతు బీమా నిజం కాదా?
నిర్మల్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో నిండు సభలో తెలంగాణ రాష్ట్రంలో ఆరు పథకాలు అమలవుతున్నాయని ప్రతి మహిళకు 2500 ఎకౌంట్లో పడుతున్నాయని అబద్దాలు చెప్పింది నిజం కాదా!
ఇన్ని మాయమాటలు చెప్పే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈనెల 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈ సమావేశంలో తోగ్గుడెం, కూనవరం మాజీ సర్పంచ్ బొగ్గo రజిత, ఏనిక ప్రసాద్, జగడి జ్యోతి, మండల కో ఆప్షన్ సభ్యులు జావిధ్ పాషా, మాజీ ఎంపీటీసీలు వల్లభనేని రమణ, మేకల రవి,మణుగూరు మండల ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి రామిరెడ్డి, రామసహాయం వెంకటరెడ్డి, మండల నాయకులు మడి వీరన్నబాబు, ఉడతనేని రవి,జగిడి ప్రసాద్, ఆడబాల సత్యవతి,పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 5

Read More »

భూదాన్ నిర్వాసితులను ఇండ్లలోకి పంపే వరకు పోరాటం చేస్తాం*

తుమ్మల , శ్రీనివాస్ రెడ్డి , భట్టి పేదల పక్షమే అంటే మా పోరాటం లో భాగస్వామ్యం కావాలి.* *బీసీ , ఎస్సీ , ఎస్టీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ విషాదారన్ మహరాజ్* నేటి

Read More »

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు ​యుద్ధ మేఘాల నేపథ్యంలో నాయకుడు క్షేమంగా రావాలని ఆకాంక్ష నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 03: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ

Read More »

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

 Don't Miss this News !