+91 95819 05907

ఆ పథకం అబాసుపాలవుతుందా..?

– కూలీల కష్టాన్ని దోచుకుంటున్నారా..?
– 33 మందికి వచ్చిన నోటీసులతో తీరు మారిందా..?
– ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయా..?
– అవకతవకలకు అవకాశం లేకుండా మండల అధికారి అలర్ట్..?

నేటి గద్దర్, మే 10, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (ప్రతినిధి) (అలవాల వంశీ) :

దేశవ్యాప్తంగా రైతు వారి కూలీలకు పనులు లేని సమయంలో ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్యంగా బూర్గంపాడు మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం సొమ్ము ఒకరిది… సోకు ఇంకొకరిది… అన్న చందంగా నవ్వుల పాలు అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి పనులు లేక ఇబ్బంది పడుతున్న కూలీలకు ఉపాధి కల్పించి ఆసరాగా నిలిచేందుకు నాటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆలోచనత్మకమైన పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. అయితే ఈ పథకం కొందరు అవినీతిపరులవల్ల అభాసుపాలు అవుతుందని స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకల పని దినాలపై చివరిగా సామాజిక తనిఖీ చేసిన సోషల్ ఆడిటింగ్ అధికారులు లోటు, పాట్లు గుర్తించారు. అదే సమయంలో మండల పరిధిలోని సుమారు 33 మంది అధికారులకు నోటీసులు అందిన విషయం కుడా విదితమే. ఓకే సమయంలో సుమారు 33 మంది అధికారులకు నోటీసులు అందిన విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీ అంశమైంది. 33 మంది అధికారులు తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కోవడం అంటే ఏ స్థాయి అవినీతి జరిగి ఉంటుందో అని పలువురు నేటికీ చర్చించుకుంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ నోటీసులు అందుకున్న అధికారులు ప్రస్తుతం తమ తీరు మార్చుకున్నారా..? లేదా దారి మార్చుకొని అదే పాత పద్ధతిని కొనసాగిస్తున్నారా అనే ప్రశ్నలు సర్వత్ర ఉత్పన్నమవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా జరిగే లోటు పాట్ల కారణంగా షోకాజ్ నోటీసుల వర్షం లో పలువురు అధికారులు తడిసిపోవడంతో, ఈ ఏడాది ముందుగానే మండల అధికారులు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు కనిపిస్తోంది, కాగ ఈ ఏడాది వచ్చిన నూతన మండల అధికారి పకడ్బందీగా ఉపాధి హామీపథకం పనిని జరిగే విధంగా ముందుకు వెళ్తున్నారు. కొందరు మేట్లు చేసే అవకతవకల కారణంగా ఈ ఏడాది ఉపాధిహామీ పని చేసే నిజమైన కూలీల పై ప్రభావం పడి రోజు కూలీ రూ.30/- నుండి రూ.60/- మాత్రమే ఈ ఏడాది పడుతున్నాయని వారు ఇప్పటికే ఇట్టి విషయం పై లబోదిబో మంటున్నారు. అయితే ఇందులో కొందరు మేట్ల స్వార్థం వలన కూలీలు నష్టపోవాల్సి వస్తుందని గ్రౌండ్ లెవెల్ అధికారులకు తెలిసినప్పటికీ తమ స్వలాభం కోసం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. పనికి రానివారికి.., ఇతర సంస్థలలో, శాఖలలో పనిచేస్తున్న వారికి సైతం కూలీలు వేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చేసిన పనికి వచ్చే ప్రతిఫలాన్ని కష్టపడిన వారితో సైతం పంచుకోవాల్సి వస్తుందని, ఎర్రటి ఎండలో గొడ్డు కష్టం చేస్తే వచ్చే కూలీలు సగం అవినీతి రాబందుల మయం అవుతుందని కూలీలు లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారులు ఇకనైనా క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో మరికొందరు అధికారుల సైతం నోటీసులు అందుకునే అవకాశం ఉంటుందని పలువురు మేధావులు పేర్కొంటున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !