+91 95819 05907

ఆ పథకం అబాసుపాలవుతుందా..?

– కూలీల కష్టాన్ని దోచుకుంటున్నారా..?
– 33 మందికి వచ్చిన నోటీసులతో తీరు మారిందా..?
– ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయా..?
– అవకతవకలకు అవకాశం లేకుండా మండల అధికారి అలర్ట్..?

నేటి గద్దర్, మే 10, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (ప్రతినిధి) (అలవాల వంశీ) :

దేశవ్యాప్తంగా రైతు వారి కూలీలకు పనులు లేని సమయంలో ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్యంగా బూర్గంపాడు మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం సొమ్ము ఒకరిది… సోకు ఇంకొకరిది… అన్న చందంగా నవ్వుల పాలు అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి పనులు లేక ఇబ్బంది పడుతున్న కూలీలకు ఉపాధి కల్పించి ఆసరాగా నిలిచేందుకు నాటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆలోచనత్మకమైన పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. అయితే ఈ పథకం కొందరు అవినీతిపరులవల్ల అభాసుపాలు అవుతుందని స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకల పని దినాలపై చివరిగా సామాజిక తనిఖీ చేసిన సోషల్ ఆడిటింగ్ అధికారులు లోటు, పాట్లు గుర్తించారు. అదే సమయంలో మండల పరిధిలోని సుమారు 33 మంది అధికారులకు నోటీసులు అందిన విషయం కుడా విదితమే. ఓకే సమయంలో సుమారు 33 మంది అధికారులకు నోటీసులు అందిన విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీ అంశమైంది. 33 మంది అధికారులు తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కోవడం అంటే ఏ స్థాయి అవినీతి జరిగి ఉంటుందో అని పలువురు నేటికీ చర్చించుకుంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ నోటీసులు అందుకున్న అధికారులు ప్రస్తుతం తమ తీరు మార్చుకున్నారా..? లేదా దారి మార్చుకొని అదే పాత పద్ధతిని కొనసాగిస్తున్నారా అనే ప్రశ్నలు సర్వత్ర ఉత్పన్నమవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా జరిగే లోటు పాట్ల కారణంగా షోకాజ్ నోటీసుల వర్షం లో పలువురు అధికారులు తడిసిపోవడంతో, ఈ ఏడాది ముందుగానే మండల అధికారులు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు కనిపిస్తోంది, కాగ ఈ ఏడాది వచ్చిన నూతన మండల అధికారి పకడ్బందీగా ఉపాధి హామీపథకం పనిని జరిగే విధంగా ముందుకు వెళ్తున్నారు. కొందరు మేట్లు చేసే అవకతవకల కారణంగా ఈ ఏడాది ఉపాధిహామీ పని చేసే నిజమైన కూలీల పై ప్రభావం పడి రోజు కూలీ రూ.30/- నుండి రూ.60/- మాత్రమే ఈ ఏడాది పడుతున్నాయని వారు ఇప్పటికే ఇట్టి విషయం పై లబోదిబో మంటున్నారు. అయితే ఇందులో కొందరు మేట్ల స్వార్థం వలన కూలీలు నష్టపోవాల్సి వస్తుందని గ్రౌండ్ లెవెల్ అధికారులకు తెలిసినప్పటికీ తమ స్వలాభం కోసం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. పనికి రానివారికి.., ఇతర సంస్థలలో, శాఖలలో పనిచేస్తున్న వారికి సైతం కూలీలు వేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చేసిన పనికి వచ్చే ప్రతిఫలాన్ని కష్టపడిన వారితో సైతం పంచుకోవాల్సి వస్తుందని, ఎర్రటి ఎండలో గొడ్డు కష్టం చేస్తే వచ్చే కూలీలు సగం అవినీతి రాబందుల మయం అవుతుందని కూలీలు లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారులు ఇకనైనా క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో మరికొందరు అధికారుల సైతం నోటీసులు అందుకునే అవకాశం ఉంటుందని పలువురు మేధావులు పేర్కొంటున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !