+91 95819 05907

ఆ పథకం అబాసుపాలవుతుందా..?

– కూలీల కష్టాన్ని దోచుకుంటున్నారా..?
– 33 మందికి వచ్చిన నోటీసులతో తీరు మారిందా..?
– ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయా..?
– అవకతవకలకు అవకాశం లేకుండా మండల అధికారి అలర్ట్..?

నేటి గద్దర్, మే 10, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (ప్రతినిధి) (అలవాల వంశీ) :

దేశవ్యాప్తంగా రైతు వారి కూలీలకు పనులు లేని సమయంలో ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్యంగా బూర్గంపాడు మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం సొమ్ము ఒకరిది… సోకు ఇంకొకరిది… అన్న చందంగా నవ్వుల పాలు అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి పనులు లేక ఇబ్బంది పడుతున్న కూలీలకు ఉపాధి కల్పించి ఆసరాగా నిలిచేందుకు నాటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆలోచనత్మకమైన పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. అయితే ఈ పథకం కొందరు అవినీతిపరులవల్ల అభాసుపాలు అవుతుందని స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకల పని దినాలపై చివరిగా సామాజిక తనిఖీ చేసిన సోషల్ ఆడిటింగ్ అధికారులు లోటు, పాట్లు గుర్తించారు. అదే సమయంలో మండల పరిధిలోని సుమారు 33 మంది అధికారులకు నోటీసులు అందిన విషయం కుడా విదితమే. ఓకే సమయంలో సుమారు 33 మంది అధికారులకు నోటీసులు అందిన విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీ అంశమైంది. 33 మంది అధికారులు తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కోవడం అంటే ఏ స్థాయి అవినీతి జరిగి ఉంటుందో అని పలువురు నేటికీ చర్చించుకుంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ నోటీసులు అందుకున్న అధికారులు ప్రస్తుతం తమ తీరు మార్చుకున్నారా..? లేదా దారి మార్చుకొని అదే పాత పద్ధతిని కొనసాగిస్తున్నారా అనే ప్రశ్నలు సర్వత్ర ఉత్పన్నమవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా జరిగే లోటు పాట్ల కారణంగా షోకాజ్ నోటీసుల వర్షం లో పలువురు అధికారులు తడిసిపోవడంతో, ఈ ఏడాది ముందుగానే మండల అధికారులు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు కనిపిస్తోంది, కాగ ఈ ఏడాది వచ్చిన నూతన మండల అధికారి పకడ్బందీగా ఉపాధి హామీపథకం పనిని జరిగే విధంగా ముందుకు వెళ్తున్నారు. కొందరు మేట్లు చేసే అవకతవకల కారణంగా ఈ ఏడాది ఉపాధిహామీ పని చేసే నిజమైన కూలీల పై ప్రభావం పడి రోజు కూలీ రూ.30/- నుండి రూ.60/- మాత్రమే ఈ ఏడాది పడుతున్నాయని వారు ఇప్పటికే ఇట్టి విషయం పై లబోదిబో మంటున్నారు. అయితే ఇందులో కొందరు మేట్ల స్వార్థం వలన కూలీలు నష్టపోవాల్సి వస్తుందని గ్రౌండ్ లెవెల్ అధికారులకు తెలిసినప్పటికీ తమ స్వలాభం కోసం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. పనికి రానివారికి.., ఇతర సంస్థలలో, శాఖలలో పనిచేస్తున్న వారికి సైతం కూలీలు వేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చేసిన పనికి వచ్చే ప్రతిఫలాన్ని కష్టపడిన వారితో సైతం పంచుకోవాల్సి వస్తుందని, ఎర్రటి ఎండలో గొడ్డు కష్టం చేస్తే వచ్చే కూలీలు సగం అవినీతి రాబందుల మయం అవుతుందని కూలీలు లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారులు ఇకనైనా క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో మరికొందరు అధికారుల సైతం నోటీసులు అందుకునే అవకాశం ఉంటుందని పలువురు మేధావులు పేర్కొంటున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !