+91 95819 05907

మిట్ట గూడెం గురుకులం బాయ్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నకుమారి ని సస్పెండ్ చేయాలి:PDSU డిమాండ్

పురుగుల అన్నం… చాలి చాలని కూరలు.. నీళ్ళ పేరుగు శీర్షిక న నేటి గద్ధర్ లో గురువారం పబ్లిష్ చెయ్యడం జరిగింది.
నేటి గద్ధర్ న్యూస్, మణుగూరు:
విద్యార్థులకు భోజనం నాణ్యతతో పెట్టకుండా అన్నంలో పురుగులు వచ్చిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మెట్టగూడెం గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నకుమారి ని సస్పెండ్ చేయాలని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృధ్వీ జిల్లా నాయకులు మునిగేలా శివ ప్రశాంత్ డిమాండ్ చేశారు. గురువారం కళాశాల విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, కళాశాల ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని పి డి యస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు నెలలుగా విద్యార్థులకు సరైన భోజనం అందించకుండా విద్యార్థులకు రావాల్సిన సీజనల్ ఫ్రూట్స్,బిస్కెట్స్, ఎగ్స్, విద్యార్థులకు ఇవ్వకుండా మాయం చేస్తూ అడిగిన విద్యార్థులను కక్షపూరితంగా టార్గెట్ చేసి బెదిరింపులకు గురి చేయడం, కళాశాల సిబ్బందితో విద్యార్థులపై ఒత్తిడి చేపించి విద్యార్థులను టీసీలు ఇచ్ఛి ఇంటికి పంపించే విధంగా గిరిజన విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం బాధాకరమని వారు అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కళాశాలకు రెగ్యులర్ గా హాజరు కాకపోవడమే కాకుండా ఫుడ్ ఇంచార్జీ లను నియమించి వారి పని విధానంతో సరైన పరిశీలన లేకపోవడం వలన విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందకపోవడం వలన తీవ్రమైన ఎండల సమయంలో విద్యార్థులకు కడుపునొప్పి, విరోచనాలు కావడం వలన డిగ్రీ పరీక్షలు సరిగా రాయలేని పరిస్థితి ఏర్పడింద ని వారు అన్నారు. ప్రిన్సిపాల్ సరైన అడ్మినిస్ట్రేషన్ లేకపోవడంతో సీనియర్ విద్యార్థులు కొంతమంది జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడడం సీనియర్ విద్యార్థులకు ప్రిన్సిపాల్ మద్దతు పలుకుతూ వారిని ప్రోత్సహించడంతో విద్యార్థుల మధ్య రెండు బృందాలుగా ఏర్పడి కళాశాలలో ఘర్షణ వాతావరణం ఏర్పడే విధంగా ప్రిన్సిపాల్ వ్యవహార శైలి ఉందని వారు అన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ కళాశాలపై పర్యవేక్షించి జరుగుతున్న పరిణామాల పట్ల పరిశీలన చేసి కళాశాల ప్రిన్సిపాల్ ను స్పెండ్ చేసి వివాదానికి పాల్పడుతున్న కొంతమంది అధ్యాపకులను సైతం కళాశాల నుండి మార్చి కళాశాలలో విద్యార్థులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !