+91 95819 05907

మిట్ట గూడెం గురుకులం బాయ్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నకుమారి ని సస్పెండ్ చేయాలి:PDSU డిమాండ్

పురుగుల అన్నం… చాలి చాలని కూరలు.. నీళ్ళ పేరుగు శీర్షిక న నేటి గద్ధర్ లో గురువారం పబ్లిష్ చెయ్యడం జరిగింది.
నేటి గద్ధర్ న్యూస్, మణుగూరు:
విద్యార్థులకు భోజనం నాణ్యతతో పెట్టకుండా అన్నంలో పురుగులు వచ్చిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మెట్టగూడెం గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నకుమారి ని సస్పెండ్ చేయాలని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృధ్వీ జిల్లా నాయకులు మునిగేలా శివ ప్రశాంత్ డిమాండ్ చేశారు. గురువారం కళాశాల విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, కళాశాల ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని పి డి యస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు నెలలుగా విద్యార్థులకు సరైన భోజనం అందించకుండా విద్యార్థులకు రావాల్సిన సీజనల్ ఫ్రూట్స్,బిస్కెట్స్, ఎగ్స్, విద్యార్థులకు ఇవ్వకుండా మాయం చేస్తూ అడిగిన విద్యార్థులను కక్షపూరితంగా టార్గెట్ చేసి బెదిరింపులకు గురి చేయడం, కళాశాల సిబ్బందితో విద్యార్థులపై ఒత్తిడి చేపించి విద్యార్థులను టీసీలు ఇచ్ఛి ఇంటికి పంపించే విధంగా గిరిజన విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం బాధాకరమని వారు అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కళాశాలకు రెగ్యులర్ గా హాజరు కాకపోవడమే కాకుండా ఫుడ్ ఇంచార్జీ లను నియమించి వారి పని విధానంతో సరైన పరిశీలన లేకపోవడం వలన విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందకపోవడం వలన తీవ్రమైన ఎండల సమయంలో విద్యార్థులకు కడుపునొప్పి, విరోచనాలు కావడం వలన డిగ్రీ పరీక్షలు సరిగా రాయలేని పరిస్థితి ఏర్పడింద ని వారు అన్నారు. ప్రిన్సిపాల్ సరైన అడ్మినిస్ట్రేషన్ లేకపోవడంతో సీనియర్ విద్యార్థులు కొంతమంది జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడడం సీనియర్ విద్యార్థులకు ప్రిన్సిపాల్ మద్దతు పలుకుతూ వారిని ప్రోత్సహించడంతో విద్యార్థుల మధ్య రెండు బృందాలుగా ఏర్పడి కళాశాలలో ఘర్షణ వాతావరణం ఏర్పడే విధంగా ప్రిన్సిపాల్ వ్యవహార శైలి ఉందని వారు అన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ కళాశాలపై పర్యవేక్షించి జరుగుతున్న పరిణామాల పట్ల పరిశీలన చేసి కళాశాల ప్రిన్సిపాల్ ను స్పెండ్ చేసి వివాదానికి పాల్పడుతున్న కొంతమంది అధ్యాపకులను సైతం కళాశాల నుండి మార్చి కళాశాలలో విద్యార్థులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !