+91 95819 05907

మరణంలో వీడని భార్యాభర్తల బంధం

… ఇద్దరికి తీవ్ర గాయాలు

కారులో వ్యాపించిన మంటలు.. ఫైర్ ఇంజన్ సహాయంతో ఆర్పివేత

నేటి గద్దర్, మే 15, బోనకల్ ప్రతినిధి:

మండలంలోని ముష్టికుంట్ల గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వివరాల్లోకి వెళ్తే ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగోలు గ్రామానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ వృత్తిరీత్యా డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పలు చోట్ల పనిచేసి మధిరలో స్థిరపడ్డాడు. ఆయనకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమారుడి ఇంటి వద్ద ఉంటున్న సూర్యనారాయణ దంపతులు ఖమ్మంలో నివాసముంటున్న పెద్ద కుమారుడు ఇంటికి బయలుదేరారు. మధిర నుంచి కారులో మనవడు అనిల్ నాయనమ్మ, తాతయ్యతో పాటు కేర్ టేకర్ నాగరాజు తో కలిసి ఖమ్మం బయలుదేరారు. ఈ క్రమంలో ముష్టికుంట్ల గ్రామం సమీపంలో ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో కారులో వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు వృద్ధ దంపతులు కొత్తూరు సూర్యనారాయణ (92), రుక్మిణీ (85) లు అక్కడికక్కడే మృతి చెందారు. అనిల్, నాగరాజు తీవ్ర గాయాలతో కారులో ఇరుక్కుపోగా సమీపంలో ఉన్నవారు అతి కష్టం మీద బయటకు లాగారు. మృతదేహాలను పొలంలో ఉంచి, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులో పెట్రోల్ పైపు పగలటంతో మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. మంటలు విస్తృతంగా పొలాల పక్కన చెట్లకు అంటుకోవడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. పోలీసుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పి వేశారు. మధిర సీఐ మధు, బోనకల్ ఎస్సై మధుబాబు లు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !