+91 95819 05907

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయం

*మానుకోటలో మార్మోగిన సన్నాహక సమావేశం

*హాజరైన ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ

*గెలిపిస్తే పేద ప్రజల రుణం తీర్చుకుంటాను…అభ్యర్థి పూజరి సత్యనారాయణ

నేటి గద్ధర్ న్యూస్ , మహబూబాబాద్: వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి పూజారి సత్యనారాయణ గారిని విద్యావంతులు, మేధావులు *38వ సీరియల్ నంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి* భారీ మెజారిటీతో గెలిపించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పట్టభద్రులను కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు గంట హరీష్ అధ్యక్షతన జరిగిన ముఖ్య సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పూజరి సత్యనారాయణ గారితో కలిసి సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి కోసం శాసనాల ప్రతిపాదనల కోసం చర్చలు చేయాల్సిన పెద్దల సభకు శాసనమండలికి విద్యావంతులైన మేధావులను పంపాలని ఈ సందర్భంగా విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై పట్టు ఉండి ప్రభుత్వ ఉద్యోగంలో నిష్కల్మషంగా, నిజాయితీగా పనిచేసిన రిటైర్డ్ ఎంఈఓ, సామాజిక ఉద్యమకారులు పూజరి సత్యనారాయణ గారిని ఓటు అనే ఆయుధం ద్వారా విద్యావంతులు సపోర్ట్ చేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పూజరి సత్యనారాయణ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి గెలిపించినట్లయితే పేద ప్రజల రుణం తీర్చుకుంటానని, విద్యా ఉద్యోగ పారిశ్రామిక రంగాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది చట్టసభల ద్వారా పేద ప్రజలగొంతునై వినిపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య, రాష్ట్ర సలహాదారులు కృష్ణమోహన్, రాష్ట్ర కార్యదర్శి మాంచాలక్క, గ్రేటర్ వరంగల్ అధ్యక్షురాలు లక్ష్మి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, ఉపాధ్యక్షులు నరేష్, ప్రచార కార్యదర్శి దాసరి భాస్కర్, చిత్తరి సోమన్న,జిల్లా కమిటీ సభ్యులు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సామాజిక ఉద్యమకారులు, ఆర్టిఐ కార్యకర్తలు, పలు సామాజిక కుల ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని సత్యనారాయణ గెలుపు కోసం పని చేస్తామని సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !