+91 95819 05907

రాజకీయ పార్టీలకతీతంగా లబ్ధి చేకూరుస్తా :మంత్రి పొంగులేటి

అభివృద్ధిని చేతల్లో చూపిస్తా

మాటలు చెప్పడం నాకు తెలీదు

మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి… మీ కష్ట సుఖాలను పంచుకుంటా

– అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే నా లక్ష్యం

– ప్రజల చెంతకే.. మీ శీనన్న
కార్యక్రమంలో మంత్రి పొంగులేటి

– ఖమ్మం రూరల్ మండలంలో విస్తృత పర్యటన

నేటి గదర్, మే 19 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):

ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా తాను ఉంటానని.. మాటలు చెప్పడం కాదని.. అభివృద్ధి అంటే ఏంటో చేతల్లో చేసి చూపుతానని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లి, పల్లెగూడెం, పోలేపల్లి, గోళ్ళపాడు, తీర్థాల , మద్దివారి గూడెం, పోలిశెట్టి గూడెం తదితర గ్రామాల్లో మీ చెంతకే శీనన్న కార్యక్రమం పేరుతో పర్యటించారు. తొలుత రెడ్డిపల్లిలోని మారెమ్మ తల్లి దేవాలయంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో పర్యటించారు.

★మంత్రి దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన సమస్యల్లో కొన్ని

★రెడ్డిపల్లి గుట్టపై ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి.
★కొత్తగా కరెంట్ స్తంభాలు వేయాలి.
★కాలనీలో సీసీ రోడ్లు పోయాలి.
★పల్లెగూడెం: బుడగ జంగాలకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలి.
★డ్రెయినేజీ సమస్య లేకుండా చూడాలి.
★పోలేపల్లి, గోళ్లపాడు..:* వీధుల్లో సీసీ రోడ్లు పోయాలి.
★ పక్కా ఇల్లు లేని వారికి.. ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయాలి.

★నేనెప్పుడూ ప్రజలతోనే ఉంటా

తాను ప్రజల మనిషినని.. ఎప్పుడూ జనంతోనే మమేకమవుతూ ఉంటానని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. వరుసగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు రావడం వల్ల అన్ని గ్రామాల పర్యటన చేపట్టడం ఆలస్యమైందని అన్నారు. కోడ్ ముగిశాక పల్లెల్లో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని తెలిపారు. పార్టీలకతీతంగా పేదలకు లబ్ధి కలిగేలా చూస్తామని అన్నారు. ప్రజల దీవెనలతోనే పాలేరు ఎమ్మెల్యే గా గెలిచానని, రాష్ట్ర మంత్రి అయ్యానని అన్నారు. శీనన్నా అని పిలిస్తే నేనున్నా అంటూ.. అండగా నిలుస్తానని అభయమిచ్చారు. తన దృష్టికి తీసుకువచ్చిన ప్రజా సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండలాధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాయకులు మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్, రామ్మూర్తి నాయక్, శ్రీనివాస రావు, భుజంగ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కూర్మా రావు, మద్ది కిషోర్ రెడ్డి, విజయ్ రెడ్డి, సురేష్ నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !