+91 95819 05907

ఆ లారీ యజమానుల ఆందోళనలకు …మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘీభావం

సింగరేణిలో స్థానిక లారీలకు బొగ్గు లోడింగ్ ఇవ్వాలి…

సత్తుపల్లి లారీ యజమానుల ఆందోళనలకు …
మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘీభావం …

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 19:

సింగరేణి సంస్థల్లో స్థానిక లారీలకు బొగ్గు లోడింగ్ ఇవ్వాలని రోడ్డు మార్గాన బొగ్గు రవాణా పూర్తిగా తగ్గించాలనే సింగరేణి యాజమాన్యం పాలసీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లికి చెందిన స్థానిక లారీ యజమానులు చేస్తున్న ఆందోళనలకు మణుగూరు ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఆదివారం నాడు సమావేశమైన లారీ యజమానులు ఈ మేరకు తీర్మానాలు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లిలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో నలభై శాతం స్థానిక లారీల ద్వారా తరలించేందుకు అవకాశం కల్పిస్తామని,మీ ఉపాధికి ఎటువంటి డొకా ఉండదని బొగ్గు గనులు ఏర్పాటు సమయంలో సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చి ఇప్పుడు లారీలకు లోడ్ ఇవ్వకపోవడం వలన లారీల కొనుగోలుకు తెచ్చిన అప్పులు తీర్చలేక భార్య పిల్లలు వేసుకునే బంగారు ఆభరణాలు,ఇండ్లు, భూములు,తాకట్టు పెట్టి లారీలు నిలబెట్టి కిస్తీలు కట్టాలన్నా రోడ్డు టాక్సీలు ప్రభుత్వానికి చెల్లించాలన్నా సంవత్సరం తర్వాత లారీకి కట్టే ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా,బ్రేకులు నేషనల్ పర్మిట్లు వేయించుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ,సత్తుపల్లి లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ యజమానులు వారి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపినప్పటికీ ప్రజాప్రతినిధులు గాని సింగరేణి యాజమాన్యం కానీ స్పందించి వారికి సరైన
హామీ ఇవ్వకపోవడంతో ఆందోళనలకు ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని అసోసియేషన్లు సంఘీభావం తెలపడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా ఈరోజు సంఘీభావం తెలపడం జరిగిందన్నారు,ఈ కార్యక్రమంలో మిడిదొడ్ల నాగేశ్వరరావు,టి శ్రీను,వెంకన్న బాబు,లాలు, తాతబ్బాయి,అంజయ్య,రామకృష్ణ,మురళి,ఉప్పలయ్య, నాగయ్య,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !