+91 95819 05907

తీన్మార్ మల్లన్న లక్ష మెజార్టీతో గెలవబోతున్నారు:మంత్రి పొంగులేటి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపు నల్లేరుపై నడకే..

గతంలోనే గెలుపు దగ్గరకు వచ్చి ఆగిన మల్లన్న..

ఓట్ల చిలికనే నాడు ఓటమి..

నేడు ఉమ్మడిగా మల్లన్నకు మద్దతు..

నిరుద్యోగుల కోసం ప్రశ్నించే గొంతుకగా మారేనా..

ఖమ్మంలో పట్టభద్రులు మల్లన్న వైపే..

ఖమ్మంలో మెజారిటీయే లక్ష్యంగా మంత్రులు బట్టి ,తుమ్మల , పొంగులేటి సమీక్షలు..

నేటి గదర్,మే 21 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):

తెలంగాణలో మరో ఎన్నిక సిద్ధం అవుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు,వెంటనే పార్లమెంట్ ఎన్నికలు అలా పూర్తి అయ్యయో లేదో తాజాగా మే 27న నల్లగొండ – వరంగల్- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టభద్రులకు దగ్గరయేలా సన్నాహాలు చేస్తున్నాయి . 2021 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఎన్నిక కావడంతో ఆయన రాజీనామాతో నల్లగొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యం అయింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న బరిలో నిలిచారు. 2021 లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిలో ఓటమి పాలయ్యారు.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీలో ఉండడం ఆయన గెలుపు నల్లేరుపై నడకే అనే చర్చ నడుస్తోంది.. మల్లన్నకు పట్టభద్రులలో మొదటి నుండే మంచి ఫాలోయింగ్ ఉండడం ,ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న పోటీలో ఉండడంతో ఆయన గెలుపు సునాయాసనమే .గతంలో బరిలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పట్టభద్రుల దగ్గరకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ దగ్గరయ్యాడు . ఇప్పుడు అవే విజయ అవకాశాలకు బాటలుగా మారుతున్నాయి. ఇక ఖమ్మం జిల్లా నుండి అత్యధిక మెజారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువే .. ఖమ్మం జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు బట్టి విక్రమార్క ,తుమ్మల నాగేశ్వరరావు ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలాగూ ఉండనే ఉన్నారు. మంగళవారం ఉదయం ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రులతో సమావేశం ఏర్పాటు చేసి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు పడేలా కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్న మల్లన్న కూడా గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో తనకు ఎలాగైతే అండగా నిలిచారో. ఇప్పుడు కూడా అదే విధంగా అండగా నిలబడాలని కోరారు. ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటంతో ఎలాగైనా ఖమ్మం జిల్లా నుండి అత్యధిక మెజారిటీ సాధించేలా పట్టభద్రులతో మమేకం అవుతున్నారు. ఎలా చూసినా తీన్మార్ మల్లన్నకు ఖమ్మం జిల్లా నుండి అత్యధిక మెజారిటీ ఖాయంగా కనిపిస్తోంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !