+91 95819 05907

గిరిజన బిడ్డ విజయలక్ష్మికు డాక్టరేట్

*గిరిజన బిడ్డ విజయలక్ష్మికు డాక్టరేట్*

◆కామర్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా

◆PhD పట్టా సాధించిన విజయలక్ష్మి పై తండావాసులు, సహచరులు, పలువురు ప్రశంసల వర్షం

నేటి గదర్,మే 21 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):

కృషి ఉంటే మ‌నుషులు ఋషుల‌వుతారు…..మ‌హా పురుషుల‌వుతారు….అన్నాడో సినీక‌వి. అకుంఠిత దీక్ష‌, ప‌ట్టుద‌ల ఉంటే దేన్నైనా సాధించ‌వ‌చ్చ‌నే ఇప్ప‌టికే ప‌లువురు నిరూపించారు. ఈ కోవా కే చెందుతుంది సామాజిక ఉద్యమ నాయకురాలు Dr.విజయలక్ష్మి.ఖమ్మం జిల్లా
కూసుమంచి మండలం గైగోళ్లపల్లి పంచాయతీ శివారు గ్రామమైన హత్యతండాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిరిజన నాయకుడు బాదావత్ లక్ష్మణ్ నాయక్ సతీమణి, సామాజిక ఉద్యమ నాయకురాలు విజయలక్ష్మికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీ వాణిజ్య శాస్త్ర విభాగంలో డా. ధర్మా నాయక్ పర్యవేక్షణలో “తెలంగాణ రాష్ట్రంలో మీ-సేవా యొక్క సర్వీసుల ద్వారా వినియోగదారుల సంతృప్తి” అనే అంశం మీద చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది. బోడియతండాలో ఒక వ్యవసాయ కుటుంబంలో భూక్య లాడియా వీరమ్మ దంపతులకు జన్మించిన భుక్యా విజయలక్ష్మి ప్రాథమిక విద్యను బోడియతండా ప్రభుత్వ పాఠశాలలో, ఉన్నత విద్యను 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ వస్తూ కూసుమంచి మండల కేంద్రంలోని ప్రజ్ఞ స్కూల్ లో, ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు ఖమ్మంలోనే వాణి జూనియర్ కళాశాల, ఆర్.జె.సి డిగ్రీ కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత నిజాం కాలేజీ హైదరాబాద్ లో ఎం.కాం. పిజిను అభ్యసించి ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్ డిగ్రీ కూడా సాధించారు. నేడు అదే యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి అయ్యాక వైవాహిక జీవితాన్ని అనుభవిస్తూ, ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ తన కర్తవ్యాన్ని మరిచిపోకుండా PhD పట్టా సాధించిన విజయలక్ష్మి పై తండావాసులు, సహచరులు, పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో విజయలక్ష్మి మాట్లాడుతూ నా పరిశోధనకు సహాయపడ్డ నా కుటుంబ సభ్యులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !