+91 95819 05907

గిరిజన బిడ్డ విజయలక్ష్మికు డాక్టరేట్

*గిరిజన బిడ్డ విజయలక్ష్మికు డాక్టరేట్*

◆కామర్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా

◆PhD పట్టా సాధించిన విజయలక్ష్మి పై తండావాసులు, సహచరులు, పలువురు ప్రశంసల వర్షం

నేటి గదర్,మే 21 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):

కృషి ఉంటే మ‌నుషులు ఋషుల‌వుతారు…..మ‌హా పురుషుల‌వుతారు….అన్నాడో సినీక‌వి. అకుంఠిత దీక్ష‌, ప‌ట్టుద‌ల ఉంటే దేన్నైనా సాధించ‌వ‌చ్చ‌నే ఇప్ప‌టికే ప‌లువురు నిరూపించారు. ఈ కోవా కే చెందుతుంది సామాజిక ఉద్యమ నాయకురాలు Dr.విజయలక్ష్మి.ఖమ్మం జిల్లా
కూసుమంచి మండలం గైగోళ్లపల్లి పంచాయతీ శివారు గ్రామమైన హత్యతండాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిరిజన నాయకుడు బాదావత్ లక్ష్మణ్ నాయక్ సతీమణి, సామాజిక ఉద్యమ నాయకురాలు విజయలక్ష్మికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీ వాణిజ్య శాస్త్ర విభాగంలో డా. ధర్మా నాయక్ పర్యవేక్షణలో “తెలంగాణ రాష్ట్రంలో మీ-సేవా యొక్క సర్వీసుల ద్వారా వినియోగదారుల సంతృప్తి” అనే అంశం మీద చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది. బోడియతండాలో ఒక వ్యవసాయ కుటుంబంలో భూక్య లాడియా వీరమ్మ దంపతులకు జన్మించిన భుక్యా విజయలక్ష్మి ప్రాథమిక విద్యను బోడియతండా ప్రభుత్వ పాఠశాలలో, ఉన్నత విద్యను 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ వస్తూ కూసుమంచి మండల కేంద్రంలోని ప్రజ్ఞ స్కూల్ లో, ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు ఖమ్మంలోనే వాణి జూనియర్ కళాశాల, ఆర్.జె.సి డిగ్రీ కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత నిజాం కాలేజీ హైదరాబాద్ లో ఎం.కాం. పిజిను అభ్యసించి ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్ డిగ్రీ కూడా సాధించారు. నేడు అదే యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి అయ్యాక వైవాహిక జీవితాన్ని అనుభవిస్తూ, ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ తన కర్తవ్యాన్ని మరిచిపోకుండా PhD పట్టా సాధించిన విజయలక్ష్మి పై తండావాసులు, సహచరులు, పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో విజయలక్ష్మి మాట్లాడుతూ నా పరిశోధనకు సహాయపడ్డ నా కుటుంబ సభ్యులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !