+91 95819 05907

కారు డోర్ లాక్…ఉపిరాడక చిన్నారి మృతి

నేటి గద్ధర్ న్యూస్, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు కళ్ళ ముందుకు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అనంతలోకాలకు వెళ్ళింది. కారు డోర్ లాక్ కావడంతో ఉపిరాడక తుదిశ్వాస విడిచింది. మణుగూరు మండలం సాంబాయిగూడెంలో ఈ విషాదం వెలుగు చూసింది. ఆడుకుంటూ వెళ్లి కారెక్కిన మూడేళ్ల చిన్నారి, కార్ డోర్స్ లాక్ అవడంతో మృతి చెందింది.
కల్నీష అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులోకి ఎక్కింది. ఈ క్రమంలోనే డోర్స్ లాక్ అవడంతో చిన్నారి కారులోనే చిక్కుకుపోయింది. ఇంటి పక్కన ఆడుకుంటుందేమో అనుకున్న తల్లిదండ్రులు చిన్నారి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడ్డారు. చుట్టూ పక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు వెతికారు. అయితే ఫలితం లేకపోయింది. చివరికి ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులో కనిపించింది కల్నిషా. వెంటనే కారు డోర్స్ ఓపెన్ చేసి చూడగా అప్పటికే తుదిశ్వాస విడిచింది చిన్నారి.

అల్లారు ముద్దుగా పెంచుకున్న మూడేళ్ళ కూతురు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాప ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు సాయి, లిఖితాలను ఓదార్చారు. ఈ ఘటనకు సంబంధించి ప్రమాదవశాత్తూ మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !