+91 95819 05907

కారుణ్య బాడీ పై 35 గాయాలు అని చెప్పి ఆమె తల్లి ఎవరి ఒత్తిడితో మాట మార్చింది?హ్యూమన్ రైట్స్ సభ్యుడి సంచలనం వ్యాఖ్యలు

కారుణ్య మృతి పట్ల హ్యూమన్ రైట్స్ సభ్యుడి సంచలనం వ్యాఖ్యలు

నేటి గదర్, మే 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకు వెళ్లట్లేదని, చనిపోయిన విద్యార్థులు తల్లి, బంధువులు ఆరోజున మీడియా సమక్షంలో చేసిన ఆరోపణలకు, వ్యక్తం చేసిన ప్రశ్నలకు సమాధానం అడుగుతున్నామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NHRCOI) బోర్డు అడ్వైజరీ మెంబర్ గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కారుణ్య మృతి పట్ల ఉన్న పలు సందేహాలకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సమాధానం దొరికే అవకాశం ఉందన్నారు. ప్రజలకు మా ద్వారా తెలిపేది, అధికారులను, కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించేది, డిమాండ్ చేసేది తప్పుడు సమాచారం కాదని.. సంఘటన జరిగిన రోజు మృతి చెందిన విద్యార్థిని తల్లి, బంధువులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలకు సమాధానం కోరుతున్నామన్నారు. కారుణ్య పై దాడి జరిగిందని, 35 గాయాలు సైతం ఉన్నాయని చెప్పిన కారుణ్య తల్లి, ఆ తర్వాత కాలేజీకి కారుణ్య మృతికి ఎటువంటి సంబంధం లేదని సంతకం పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఒకవేళ కారుణ్య మృతి ఆత్మహత్య అయితే ఏం ఇబ్బంది వల్ల కారుణ్య ఆత్మహత్య చేసుకున్న అనే కోణంలో సైతం విచారణ జరిపించి ఆత్మహత్యకు మోటివ్ ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మారుతి మెడికల్ కళాశాల నడుస్తున్న తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థిని మృతి పట్ల సిట్టింగ్ జడ్జితో పాటు, నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా కమిటీ వేసి కాలేజీ ఏ విధంగా నడుస్తుంది అన్న విషయంపై సైతం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2012 నుండి నేటి వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు పదిమందికి పైగా విద్యార్థులు మృతి చెందారని ఆయన అన్నారు. మీడియా సమక్షంలో వీడియో రికార్డెడ్ గా కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మారుతి మెడికల్ కళాశాలలో ఇన్నాళ్లు హరాస్మెంట్ జరిగితే, ఇప్పుడు మ్యాన్ హ్యాండిల్ ఏం జరుగుతుంది అన్న ఆరోపణలపై స్పష్టత రావాలని వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !