+91 95819 05907

కారుణ్య బాడీ పై 35 గాయాలు అని చెప్పి ఆమె తల్లి ఎవరి ఒత్తిడితో మాట మార్చింది?హ్యూమన్ రైట్స్ సభ్యుడి సంచలనం వ్యాఖ్యలు

కారుణ్య మృతి పట్ల హ్యూమన్ రైట్స్ సభ్యుడి సంచలనం వ్యాఖ్యలు

నేటి గదర్, మే 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకు వెళ్లట్లేదని, చనిపోయిన విద్యార్థులు తల్లి, బంధువులు ఆరోజున మీడియా సమక్షంలో చేసిన ఆరోపణలకు, వ్యక్తం చేసిన ప్రశ్నలకు సమాధానం అడుగుతున్నామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NHRCOI) బోర్డు అడ్వైజరీ మెంబర్ గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కారుణ్య మృతి పట్ల ఉన్న పలు సందేహాలకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సమాధానం దొరికే అవకాశం ఉందన్నారు. ప్రజలకు మా ద్వారా తెలిపేది, అధికారులను, కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించేది, డిమాండ్ చేసేది తప్పుడు సమాచారం కాదని.. సంఘటన జరిగిన రోజు మృతి చెందిన విద్యార్థిని తల్లి, బంధువులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలకు సమాధానం కోరుతున్నామన్నారు. కారుణ్య పై దాడి జరిగిందని, 35 గాయాలు సైతం ఉన్నాయని చెప్పిన కారుణ్య తల్లి, ఆ తర్వాత కాలేజీకి కారుణ్య మృతికి ఎటువంటి సంబంధం లేదని సంతకం పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఒకవేళ కారుణ్య మృతి ఆత్మహత్య అయితే ఏం ఇబ్బంది వల్ల కారుణ్య ఆత్మహత్య చేసుకున్న అనే కోణంలో సైతం విచారణ జరిపించి ఆత్మహత్యకు మోటివ్ ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మారుతి మెడికల్ కళాశాల నడుస్తున్న తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థిని మృతి పట్ల సిట్టింగ్ జడ్జితో పాటు, నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా కమిటీ వేసి కాలేజీ ఏ విధంగా నడుస్తుంది అన్న విషయంపై సైతం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2012 నుండి నేటి వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు పదిమందికి పైగా విద్యార్థులు మృతి చెందారని ఆయన అన్నారు. మీడియా సమక్షంలో వీడియో రికార్డెడ్ గా కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మారుతి మెడికల్ కళాశాలలో ఇన్నాళ్లు హరాస్మెంట్ జరిగితే, ఇప్పుడు మ్యాన్ హ్యాండిల్ ఏం జరుగుతుంది అన్న ఆరోపణలపై స్పష్టత రావాలని వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !