+91 95819 05907

కారుణ్య బాడీ పై 35 గాయాలు అని చెప్పి ఆమె తల్లి ఎవరి ఒత్తిడితో మాట మార్చింది?హ్యూమన్ రైట్స్ సభ్యుడి సంచలనం వ్యాఖ్యలు

కారుణ్య మృతి పట్ల హ్యూమన్ రైట్స్ సభ్యుడి సంచలనం వ్యాఖ్యలు

నేటి గదర్, మే 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకు వెళ్లట్లేదని, చనిపోయిన విద్యార్థులు తల్లి, బంధువులు ఆరోజున మీడియా సమక్షంలో చేసిన ఆరోపణలకు, వ్యక్తం చేసిన ప్రశ్నలకు సమాధానం అడుగుతున్నామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NHRCOI) బోర్డు అడ్వైజరీ మెంబర్ గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కారుణ్య మృతి పట్ల ఉన్న పలు సందేహాలకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సమాధానం దొరికే అవకాశం ఉందన్నారు. ప్రజలకు మా ద్వారా తెలిపేది, అధికారులను, కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించేది, డిమాండ్ చేసేది తప్పుడు సమాచారం కాదని.. సంఘటన జరిగిన రోజు మృతి చెందిన విద్యార్థిని తల్లి, బంధువులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలకు సమాధానం కోరుతున్నామన్నారు. కారుణ్య పై దాడి జరిగిందని, 35 గాయాలు సైతం ఉన్నాయని చెప్పిన కారుణ్య తల్లి, ఆ తర్వాత కాలేజీకి కారుణ్య మృతికి ఎటువంటి సంబంధం లేదని సంతకం పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఒకవేళ కారుణ్య మృతి ఆత్మహత్య అయితే ఏం ఇబ్బంది వల్ల కారుణ్య ఆత్మహత్య చేసుకున్న అనే కోణంలో సైతం విచారణ జరిపించి ఆత్మహత్యకు మోటివ్ ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మారుతి మెడికల్ కళాశాల నడుస్తున్న తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థిని మృతి పట్ల సిట్టింగ్ జడ్జితో పాటు, నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా కమిటీ వేసి కాలేజీ ఏ విధంగా నడుస్తుంది అన్న విషయంపై సైతం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2012 నుండి నేటి వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు పదిమందికి పైగా విద్యార్థులు మృతి చెందారని ఆయన అన్నారు. మీడియా సమక్షంలో వీడియో రికార్డెడ్ గా కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మారుతి మెడికల్ కళాశాలలో ఇన్నాళ్లు హరాస్మెంట్ జరిగితే, ఇప్పుడు మ్యాన్ హ్యాండిల్ ఏం జరుగుతుంది అన్న ఆరోపణలపై స్పష్టత రావాలని వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !