+91 95819 05907

విధుల్లో ఉన్న ఏఎస్ఐ పై దాడి! అదుపుతప్పుతున్నారు

బరితెగించిన ఇసుక దొంగలు
– విధుల్లో ఉన్న ఏఎస్ఐ పై దాడి
– దళితుడైన అధికారిపై దాడిని ఖండిస్తున్న పలువురు నాయకులు

నేటి గదర్, మే 30, డెస్క్ ప్రతినిధి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలో అక్రమ ఇసుక తోలకాలు నిర్వహిస్తున్న ఇసుక దొంగలు నానాటికి బరితెగించి అక్రమాలకు, ఆగడాలకు పాల్పడుతున్నారు. ఈ నేపద్యంలో మంగళవారం అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుమన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న సుమారు 6 ట్రాక్టర్లను పట్టుకొని చేసిన తరలించారు. కాగా బుధవారం ఇతర వ్యక్తులు వేరే కేసు పై పోలీస్ స్టేషన్లో ఉన్న తమ కారును రిలీవ్ చేయించుకునేందుకు ఇతర ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తులతో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వ్యక్తులు గొడవ పడుతుండగా వారిని వారించేందుకు వచ్చిన ఏఎస్ఐ పై సదరు ఇసుక దొంగలు దాడికి దిగారు. కాగా ఏఎస్ఐ తనపై దాడి చేసిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ పై దాడికి పాల్పడిన నిమ్మల హరీష్, కన్నెబోయిన సారధి, ప్రసాద్, గుండె వెంకటేష్, మహేష్ అను వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం.

– దళిత ఏఎస్ఐ పై దాడిని ఖండిస్తున్న పలువురు నాయకులు

దళిత ఏఎస్ఐ పై అమానుషం
బూర్గంపాడు మండలంలో దళిత ఏఎస్ఐ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న దళిత ఏఎస్ఐ ని, కొట్టి వ్యక్తుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం
– MRPS సీనియర్ నాయకులు అలవాల రాజా

పోలీసులకే భద్రత లేకపోతే సామాన్యులకు రక్షణ ఎట్లా
శాంతి భద్రతలు కాపాడే పోలీసులకే భద్రత లేకపోతే సామాన్య ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారు. కాబట్టి వెంటనే ఏఎస్ఐ పై దాడికి పాల్పడిన వ్యక్తి, అతని అనుచరులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కొట్టడం అనేది అందులో ఒక దళిత అధికారి అని చిన్న చూపుతో దాడి చేయడం అనేది కాంగ్రెస్ నాయకుల ప్రవర్తన ఏ స్థాయికి దిగజారిందో ప్రజలందరికీ తెలియజేస్తుంది
– BRS పినపాక నియోజకవర్గం SC సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !