+91 95819 05907

విధుల్లో ఉన్న ఏఎస్ఐ పై దాడి! అదుపుతప్పుతున్నారు

బరితెగించిన ఇసుక దొంగలు
– విధుల్లో ఉన్న ఏఎస్ఐ పై దాడి
– దళితుడైన అధికారిపై దాడిని ఖండిస్తున్న పలువురు నాయకులు

నేటి గదర్, మే 30, డెస్క్ ప్రతినిధి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలో అక్రమ ఇసుక తోలకాలు నిర్వహిస్తున్న ఇసుక దొంగలు నానాటికి బరితెగించి అక్రమాలకు, ఆగడాలకు పాల్పడుతున్నారు. ఈ నేపద్యంలో మంగళవారం అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుమన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న సుమారు 6 ట్రాక్టర్లను పట్టుకొని చేసిన తరలించారు. కాగా బుధవారం ఇతర వ్యక్తులు వేరే కేసు పై పోలీస్ స్టేషన్లో ఉన్న తమ కారును రిలీవ్ చేయించుకునేందుకు ఇతర ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తులతో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వ్యక్తులు గొడవ పడుతుండగా వారిని వారించేందుకు వచ్చిన ఏఎస్ఐ పై సదరు ఇసుక దొంగలు దాడికి దిగారు. కాగా ఏఎస్ఐ తనపై దాడి చేసిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ పై దాడికి పాల్పడిన నిమ్మల హరీష్, కన్నెబోయిన సారధి, ప్రసాద్, గుండె వెంకటేష్, మహేష్ అను వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం.

– దళిత ఏఎస్ఐ పై దాడిని ఖండిస్తున్న పలువురు నాయకులు

దళిత ఏఎస్ఐ పై అమానుషం
బూర్గంపాడు మండలంలో దళిత ఏఎస్ఐ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న దళిత ఏఎస్ఐ ని, కొట్టి వ్యక్తుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం
– MRPS సీనియర్ నాయకులు అలవాల రాజా

పోలీసులకే భద్రత లేకపోతే సామాన్యులకు రక్షణ ఎట్లా
శాంతి భద్రతలు కాపాడే పోలీసులకే భద్రత లేకపోతే సామాన్య ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారు. కాబట్టి వెంటనే ఏఎస్ఐ పై దాడికి పాల్పడిన వ్యక్తి, అతని అనుచరులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కొట్టడం అనేది అందులో ఒక దళిత అధికారి అని చిన్న చూపుతో దాడి చేయడం అనేది కాంగ్రెస్ నాయకుల ప్రవర్తన ఏ స్థాయికి దిగజారిందో ప్రజలందరికీ తెలియజేస్తుంది
– BRS పినపాక నియోజకవర్గం SC సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !