+91 95819 05907

కల్యాణం.. సామూహిక(త)o

★165 జంటలకు సామూహిక వివాహాలు
★ హాజరైన త్రిదండి చిన్న జీయర్ స్వామి
★ జిల్లా నలుమూలల నుండి హాజరైన చిన్న జీయర్ స్వామి వేలాది భక్తులు,మహిళలు
★ 20వేల మందికి మహా అన్నదాన కార్యక్రమం
★ అనంతారంలో పండుగ వాతావరణం
నేటి గద్ధర్ న్యూస్ ,ప్రత్యేక ప్రతినిధి(మణుగూరు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో 165 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి.ఈ సామూహిక వివాహలకు త్రిదండి చిన్నజీయర్ స్వామి హాజరై వివాహ తంతును దగ్గరుండి జరిపించారు గురువారం మణుగూరు మండలం అనంతారం గ్రామంలో నిర్వహించిన 165 సామూహిక వివాహలు సామాజిక సేవ నాయకురాలు, దానధర్మ ట్రస్ట్ సభ్యురాలు గంట రాధ ఆధ్వర్యంలో జరిపించారు. ముందుగా 165 మంది జంటలకు హిందుత్వ సంప్రదాయం మేరకు ఆయా జంటలకు వివాహ తంతు జరిపించడం జరిగింది . అనంతరం చిన్న జీయర్ స్వామి భార్య, భర్తల దాంపత్యం గురించి నవ దంపతులకు వివరించారు. ప్రతి జంటను అక్షింతలతో ఆశీర్వదించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామితో పాటు ముగ్గురు జీయర్లు నవ దంపతులను ఆశీర్వదించారు. 165 మండపాలలో 30 మంది పరివార్లు, వేద పండితులు వివాహ కార్యక్రమ తంతు నిర్వహించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి వస్తున్నారని తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చిన్న జీయర్ స్వామి ప్రవచనాలను విన్నారు. కళ్యాణ అనంతరం సుమారు 20వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు, చిన్న జీయర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !