+91 95819 05907

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి:జిల్లా SP అఖిల్ మహాజన్

నేటి గద్ధర్ న్యూస్,రాజన్న సిరిసిల్ల జిల్లా (జూన్, 05)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు.సిరిసిల్ల పట్టణంలోని రగుడు చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు సాగిన సైకిల్ ర్యాలీలో పాల్గొని మొక్కలు జిల్లా ఎస్పీ ,పోలీస్ అధికారులు, సిబ్బంది, యువకులు మొక్కలను నాటినారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ,ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోని చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్యరాహిత సమాజాన్ని అందిగలమని అన్నారు. స్వచ్ఛమైన అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం గురించి మొక్కలు నాటాలని,నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని ,ఫలితంగా అక్కడ ఉండే వారి యొక్క ఆలోచన విధానం కూడా మారుతుందని అన్నారు. ప్రకృతి మనకు ఎంత ముఖ్యమైనదని, ప్రకృతి తరువాతనే జీవకోటి భూమి పైకి వచ్చిందన్న విషయం చరిత్ర చెప్పిన సత్యం అని అన్నారు. భూ మండలం పై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణ వాయువు అయిన ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయం లో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని , భూమి మీద పశుపక్షాదుల నివాసం చెట్లే నని , మానవ జీవన విధానంలో చెట్ల పాత్ర ఎంతో ముడిపడి ఉందని అన్నారు. మొక్కలు మానవ జీవ కోటికి ప్రాణధారము అనీ భూ భాగములో జీవ కోటికి అత్యంత అవసరము అయిన వాటిలో మొక్కలు ప్రధానమైనవి అనీ ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యతగా నాటిన మొక్కలను ఖచ్చితంగా రక్షించాలని తెలియజేసారూ.సైక్లింగ్ , వ్యాయమం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందవచ్చునని , ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక గంట సేపు సైక్లింగ్ , వ్యాయమం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ నాగేంద్రాచరి, సి.ఐ లు రఘుపతి, శ్రీనివాస్ గౌడ్,వీరప్రతాప్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్.ఐ లు యాదగిరి, రమేష్, ఎస్.ఐ లు , సిబ్బంది, పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

 Don't Miss this News !