+91 95819 05907

లయన్స్ క్లబ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పర్యావరణ పరిరక్షణకై లయన్స్ క్లబ్ సభ్యులతో ప్రతీజ్ఞ…

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 5:

మణుగూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం,
పర్యావరణ పరిరక్షణకై సభ్యులతో ప్రతీజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా
లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల పూర్ణ చందర్ రావు,సెక్రటరీ డాక్టర్ షేక్ మీరా హుస్సేన్ మాట్లాడుతూ,మానవాళికి చెట్లు ఎంతో ముఖ్యమని,ప్రతీ కుటుంబం నుండి కనీసం 3 మొక్కలు అయినా నాటాలని పేర్కొన్నారు. అడవుల సంఖ్య తగ్గడం వలన భూతాపం పెరుగుతున్నదని,దీని వలన భూమి మీద మానవ మనవడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్నదని తెలిపారు.సముద్రాలలోని మంచు ఖండాలు కరిగి,పెను విపత్తులు సంభవించే ప్రమాదం ఉందన్నారు,సామాజిక బాధ్యతతో ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటి, సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.ప్రపంచ పౌరుడిగా ఇది ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యం అని అన్నారు.ఈ భూమి మీద భావితరాల సంక్షేమం కోసం మనం మొక్కలను నాటి ప్రకృతిని రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ప్రెసిడెంట్ గాజుల పూర్ణ చందర్ రావు, సెక్రటరీ డాక్టర్ షేక్ మీరా హుస్సేన్,ఎలక్ట్ ప్రెసిడెంట్ సత్య ప్రకాష్,అడబాల నాగేశ్వరరావు, ముత్తంశెట్టి నాగేశ్వరావు, కముజు చంద్రమోహన్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వినూతన ఆలోచనలు… అభివృద్ధిలో దూసుకుపోతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

*కలెక్టర్ నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెం అభివృద్ధి బాటలో…* *వివిధ రంగాల్లో మార్గదర్శకంగా నిలుస్తున్న కలెక్టర్ జితేష్ వి. పాటిల్.* *పాలనలో తనదైన శైలితో ఉత్తమంగా.. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ.. ప్రజలకు సేవలు అందిస్తున్న

Read More »

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

 Don't Miss this News !