+91 95819 05907

వైరాలో 100 పడకాల హాస్పిటల్ కి గ్రీన్ సిగ్నల్

నేటి గదర్ న్యూస్ , వైరా ప్రతినిధి :

వైరా పట్టణం లో కేవీసీఎం డిగ్రీ కాలేజీ మరియు ఎన్నారై పాలిటెక్నిక్ కళాశాల భవనాల్లో తాత్కాలికంగా వంద పడకల ఆసుపత్రిఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

ఆ విషయాన్ని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సోమవారం వైరాలో మూతపడి ఉన్న కేవీసీఎం డిగ్రీ, ఎన్నారై పాలిటెక్నిక్ కళాశాల భవనాలను, పరిసరాలను సందర్శించి పరిశీలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన వైరాలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది.

వంద పడకల ఆసుపత్రికి శాశ్వత భవనాలు నిర్మించే వరకు వేచి చూడకుండా వెంటనే ప్రైవేట్ భవనాల్లో నైనా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు సూచించారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే రంగంలోకి దిగారు. ఈ వంద పడకల ఆసుపత్రికి శాశ్వత భవనాలు ఏర్పాటు చేసేందుకు సేకరించిన రెవెన్యూ కార్యాలయం వెనుక భాగంలోని స్థలాన్ని ముందుగా పరిశీలించారు. ఈ స్థలంలో ఆసుపత్రి భవనాలు నిర్మించేందుకు కనీసం ఏడాది సమయమైనా పడుతుందని అప్పటివరకు వేచి చూడకుండా ఈ ఆసుపత్రిని ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటు చేయాలని చర్చ జరిగింది.

ప్రైవేట్ భవనాలకు బదులు గత పదేళ్ల నుంచి నిరుపయోగంగా ఉంటున్న కేవీసీఎం విద్యాసంస్థల భవనాల్లో తాత్కాలికంగా వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే విశాలమైన ఆవరణం, పక్కాగా ఉన్న భవనాల్లో ఎలాంటి అద్దెలు లేకుండా ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా ఉంటుందని, రోగులకు సౌకర్యవంతంగా ఉపయోగపడుతుందని భావించి ఈ విద్యాసంస్థలను పరిశీలించిన ఎమ్మెల్యే తదితరులు ఇక్కడే తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత ఏడాది జూలైలో వైరా కు వంద పడకల ఆసుపత్రి మంజూరైంది. డాక్టర్లు సహా సిబ్బంది మొత్తం 98 పోస్టులు మంజూరయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టాఫ్ నర్సులను కూడా కేటాయించింది.

ఇప్పటికే ఈ కేవీసీఎం విద్యాసంస్థలను విద్యావసరాల నిమిత్తం ప్రభుత్వానికి స్వాధీనం చేయటానికి యాజమాన్యం నిర్ణయించి ప్రతిపాదించింది. వెంటనే వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి శాశ్వత భవనాల నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఆసుపత్రిని అక్కడకు తరలించే విధంగా చర్చలు జరిపి నిర్ణయించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్. వేణు, వైరా పిహెచ్సి డాక్టర్ తాతా ఉదయలక్ష్మి, వైరా, కొణిజర్ల మండల కాం గ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, వడ్డే నారాయణ, నాయకులు దాసరి దానియేలు, ఏదునూరి సీతరాములు, పమ్మి అశోక్, వల్లపు కొండలు, సూర్యదేవర శ్రీధర్, మల్లు రామకృష్ణ, మూడుముంతల గంగరాజు , పాలేటి నరసింహారావు, పఠాన్ జాన్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !