+91 95819 05907

వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

– ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన రెండు రైతు వేదికలలో ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాలు.

– సేంద్రియ వ్యవసాయం పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి.

– వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

– రైతు నేస్తం కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కె కౌశిక్), జూన్ 11:

వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తో కలిసి వ్యవసాయ రంగం లో రైతు నేస్తం కార్యక్రమం పై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చంద్ర తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యకలాపాలు బలోపేతం చేయడం కొరకు, రైతులలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై విస్తృత అవగాహన కల్పించుటకు పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రెండు రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ హాళ్లను ప్రారంభించామని ప్రతి మంగళవారం రైతు వేదికలో రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో పంటల మార్పిడి, పంటలకు వచ్చే చీడలు, సేంద్రియ వ్యవసాయం తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వెరైటీ పంటల సాగు చేసే రైతులతో, స్థానిక ఆదర్శ రైతులతో వారి అనుభవాలను ఇతర రైతులకు తెలియజేసే కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
రైతులు వ్యవసాయ సాగులో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువుల వినియోగం వైపు దృష్టి పెట్టాలన్నారు. అధిక దిగుబడినిచ్చే పంటలకు రైతులు ప్రాధాన్యత ఇచ్చి వాటి సేద్య వివరాలను పద్ధతులను స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకోవాలని రైతులకు సూచించారు.వ్యవసాయ సాగు మొదటి దశలో విత్తనాల ఎంపికలు రైతులు తొందర పడకూడదని విత్తనాల విషయంలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించే పంటలు ప్రపంచ దేశాలను ఆకర్షించే విధంగా ఉండాలని సేంద్రియ వ్యవసాయంపై రైతులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కాలానుగుణంగా పంట మార్పిడి చేయాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం కొరకు ప్రతి మంగళవారం, వ్యవసాయ అధికారులు రైతులతో రైతు నేస్తం పేరిట రైతు వేదికల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి సాంకేతికతను అనుసంధానం చేస్తూ రైతు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందేలా రైతులు నూతన విధానాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏవో సంతోష్ , వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

 Don't Miss this News !