+91 95819 05907

వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

– ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన రెండు రైతు వేదికలలో ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాలు.

– సేంద్రియ వ్యవసాయం పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి.

– వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

– రైతు నేస్తం కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కె కౌశిక్), జూన్ 11:

వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తో కలిసి వ్యవసాయ రంగం లో రైతు నేస్తం కార్యక్రమం పై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చంద్ర తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యకలాపాలు బలోపేతం చేయడం కొరకు, రైతులలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై విస్తృత అవగాహన కల్పించుటకు పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రెండు రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ హాళ్లను ప్రారంభించామని ప్రతి మంగళవారం రైతు వేదికలో రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో పంటల మార్పిడి, పంటలకు వచ్చే చీడలు, సేంద్రియ వ్యవసాయం తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వెరైటీ పంటల సాగు చేసే రైతులతో, స్థానిక ఆదర్శ రైతులతో వారి అనుభవాలను ఇతర రైతులకు తెలియజేసే కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
రైతులు వ్యవసాయ సాగులో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువుల వినియోగం వైపు దృష్టి పెట్టాలన్నారు. అధిక దిగుబడినిచ్చే పంటలకు రైతులు ప్రాధాన్యత ఇచ్చి వాటి సేద్య వివరాలను పద్ధతులను స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకోవాలని రైతులకు సూచించారు.వ్యవసాయ సాగు మొదటి దశలో విత్తనాల ఎంపికలు రైతులు తొందర పడకూడదని విత్తనాల విషయంలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించే పంటలు ప్రపంచ దేశాలను ఆకర్షించే విధంగా ఉండాలని సేంద్రియ వ్యవసాయంపై రైతులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కాలానుగుణంగా పంట మార్పిడి చేయాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం కొరకు ప్రతి మంగళవారం, వ్యవసాయ అధికారులు రైతులతో రైతు నేస్తం పేరిట రైతు వేదికల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి సాంకేతికతను అనుసంధానం చేస్తూ రైతు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందేలా రైతులు నూతన విధానాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏవో సంతోష్ , వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

 Don't Miss this News !