+91 95819 05907

వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

– ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన రెండు రైతు వేదికలలో ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాలు.

– సేంద్రియ వ్యవసాయం పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి.

– వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

– రైతు నేస్తం కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కె కౌశిక్), జూన్ 11:

వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తో కలిసి వ్యవసాయ రంగం లో రైతు నేస్తం కార్యక్రమం పై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చంద్ర తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యకలాపాలు బలోపేతం చేయడం కొరకు, రైతులలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై విస్తృత అవగాహన కల్పించుటకు పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రెండు రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ హాళ్లను ప్రారంభించామని ప్రతి మంగళవారం రైతు వేదికలో రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో పంటల మార్పిడి, పంటలకు వచ్చే చీడలు, సేంద్రియ వ్యవసాయం తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వెరైటీ పంటల సాగు చేసే రైతులతో, స్థానిక ఆదర్శ రైతులతో వారి అనుభవాలను ఇతర రైతులకు తెలియజేసే కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
రైతులు వ్యవసాయ సాగులో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువుల వినియోగం వైపు దృష్టి పెట్టాలన్నారు. అధిక దిగుబడినిచ్చే పంటలకు రైతులు ప్రాధాన్యత ఇచ్చి వాటి సేద్య వివరాలను పద్ధతులను స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకోవాలని రైతులకు సూచించారు.వ్యవసాయ సాగు మొదటి దశలో విత్తనాల ఎంపికలు రైతులు తొందర పడకూడదని విత్తనాల విషయంలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించే పంటలు ప్రపంచ దేశాలను ఆకర్షించే విధంగా ఉండాలని సేంద్రియ వ్యవసాయంపై రైతులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కాలానుగుణంగా పంట మార్పిడి చేయాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం కొరకు ప్రతి మంగళవారం, వ్యవసాయ అధికారులు రైతులతో రైతు నేస్తం పేరిట రైతు వేదికల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి సాంకేతికతను అనుసంధానం చేస్తూ రైతు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందేలా రైతులు నూతన విధానాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏవో సంతోష్ , వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !