+91 95819 05907

బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి :: జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కౌశిక్), జూన్ 11.

బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలని స్థానిక సంస్థలు పి.శ్రీజ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ విద్య శాఖ అధికారి పణిని , డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్ లతో కలిసి జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో బడిబాట కార్యక్రమం పై సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ పి .శ్రీజ మాట్లాడుతూ విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని,శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని అన్నారు. గ్రామాలలో బడి మానేసే విద్యార్థి సంఖ్య తగ్గించాలని బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందని తెలిపారు. ఈ సమావేశం లో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు రాజు, సాంబయ్య, రమాదేవి, మల్లారెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసులు, దివాకర్, సురేందర్, సాంబయ్య, వెంకటేశ్వర్లు, రాజేష్ జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

 Don't Miss this News !