+91 95819 05907

ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో ముందుకు.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు.

* పిలుపునిచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర నేత మద్దినేని స్వర్ణ కుమారి.
* ఎంపీ రఘురాం రెడ్డి క్యాంపు కార్యాలయంలో
ఘనంగా ఉక్కు మహిళ
జయంతి వేడుకలు.

ఖమ్మం: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి అందించిన సంక్షేమ పాలన స్ఫూర్తితో తెలంగాణలో ముందుకు సాగుతున్నామని కాంగ్రెస్ రాష్ట్ర నేత మద్దినేని స్వర్ణకుమారి అన్నారు. ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ తో కలిసి ఉక్కు మహిళ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, శ్రేణులను ఉద్దేశించి స్వర్ణకుమారి మాట్లాడుతూ.. గరీబీ హటావో ( పేదరికాన్ని పారదోలుదాం ) అంటూ.. అట్టడుగు వర్గాలు, సామాన్యుల సంక్షేమానికి ప్రధానిగా పెద్దపీట వేశారని తెలిపారు. బ్యాంకుల జాతీయ కరణ, 20 సూత్రాల కార్యక్రమం, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి వేసిన బాటలు, అమలు చేసిన సంస్కరణలతో దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని చెప్పారు. ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతోందని అన్నారు. ఉభయ జిల్లాల అభివృద్ధికి.. మంత్రులు పొంగులేటి, భట్టి, తుమ్మల నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యస్థాపనకు అంతా కృషి చేద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యం బాబు, నాయకులు ఇమామ్ బాయ్, కృష్ణారెడ్డి, ప్రతిభా రెడ్డి, విప్లవ కుమార్, శ్రీకళా రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !