+91 95819 05907

సింగరేణి కి మా భూముల కావాలి.కానీ మా జీవితాలలో పని లేదా?

*సింగరేణి భూసేకరణ – భూములు తీసుకోవాలి కానీ ఉద్యోగాలు ఇవ్వకూడదా?*

*రైతుల హక్కుల కోసం పోరాడుదాం*

మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి *భూసేకరణ అధికారి & స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ మేడం గారు,* *సింగరేణి అధికారులు,* ప్రభుత్వ ఉన్నతాధికారులు, భూసేకరణ బాధిత రైతులు హాజరయ్యారు.

రామానుజవరం, తీరలాపురం, మణుగూరు గ్రామాల భూములు సింగరేణి సంస్థకు ప్రభుత్వం అప్పగించాలని యోచిస్తున్న నేపథ్యంలో, భూమిని కోల్పోతున్న రైతులు తమ హక్కుల కోసం గళమెత్తారు.

ఈ సమావేశంలో తీరలాపురం *మాజీ సర్పంచ్ పాయం కామరాజు గారు*, *రామానుజవరం మాజీ సర్పంచ్ బాడీష సతీష్ గారు* రైతుల తరఫున గట్టిగా నిలబడి, న్యాయం కోసం డిమాండ్ చేశారు.

*రైతుల స్పష్టమైన డిమాండ్లు:-*

✔ భూమిని కోల్పోయే ప్రతీ కుటుంబానికి సింగరేణి సంస్థలో ప్రభుత్వ ఉద్యోగ హామీ ఇవ్వాలి!
✔ గిరిజనులకు, గిరిజనేతరులకు సమానంగా ఉద్యోగాలు కల్పించాలి!
✔ 2003 భూసేకరణ చట్టం & PESA చట్టం ప్రకారం గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయాలి!
✔ భూమి మాత్రమే తీసుకుని రైతులను నిరుపేదలుగా మిగల్చిపెట్టడం న్యాయమా? కనీసం ఎకరాకు ₹40 లక్షల పరిహారం అందించాలి!
✔ రైతుల భవిష్యత్తును ధ్వంసం చేసే ఎటువంటి ఒప్పందాలనూ అంగీకరించబోము!
✔ రైతుల పిల్లల భవిష్యత్తు కోసమే మా భూములు? అయితే వారికి ఉచితంగా విద్య, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి!
✔ ప్రభుత్వం మా భూమిని తీసుకోవాలంటే గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి!

*అధికారుల హామీ – కానీ రైతులలో పెరుగుతున్న అసంతృప్తి*

భూసేకరణ అధికారి సుమ మేడం గారు భూసేకరణ బాధితుల డిమాండ్లను పరిశీలిస్తున్నామని, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అయితే, అధికారుల హామీ రైతులకు స్పష్టమైన భరోసా కల్పించలేదు!
ఉద్యోగాల విషయంలో గందరగోళంగా మాట్లాడడం, పరిహారం పరిమితంగా ఉండటం రైతులలో తీవ్ర అసంతృప్తి కలిగించింది!

*తీరలాపురం మాజీ సర్పంచ్ పాయం కామరాజు గారి ఘాటైన హెచ్చరిక*

➡ “రైతులు తమ భూములను కోల్పోతున్నారు. భూమి పోయిన తర్వాత కుటుంబాల భవిష్యత్తు ఏమవుతుంది?
➡ “భూమి పోతే ఉద్యోగ భరోసా ఉండాలి! గిరిజనులకు, గిరిజనేతరులకు సమానంగా ఉద్యోగాలు ఇవ్వాలి!”
➡ “అధికారుల హామీలతో మాకు పనిలేదు, గట్టి చర్యలు కావాలి!”
➡ “ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయకపోతే, రైతులందరం ఉద్యమానికి సిద్ధం!”

*రామానుజవరం మాజీ సర్పంచ్ బాడీష సతీష్ గారి గట్టి మాటలు*

➡ “భూమి ఇచ్చిన రైతుల కుటుంబాలు రోడ్డున పడితే, ఈ భూసేకరణ ఒప్పందం ఆమోదయోగ్యమా?”
➡ “ఉద్యోగాలు, సరైన పరిహారం లేకుండా మా భూములను లాక్కోవాలని చూస్తే, దీని తీవ్ర పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది!”
➡ “2003 చట్టం & PESA చట్టం ప్రకారం మా హక్కులు మాకు ఇవ్వకపోతే, మేము పోరాటానికి సిద్ధం!”

*రైతుల ఉద్యమం తప్పదు! – ఒక్కరైతు కూడా వెనక్కి తగ్గొద్దు*

*✅ అధికారుల తేలికపాటి హామీలతో మోసపోవద్దు*
*✅ ఉద్యోగం లేకుండా భూమిని అప్పగించొద్దు*
*✅ ప్రభుత్వం & అధికారులు తక్షణమే రైతుల డిమాండ్లను తీర్చాలి*
*✅ రైతులు ఏకతాటిపై నిలబడి, పోరాటం కొనసాగించాలి*

*”భూమిని తీసుకుంటే – భవిష్యత్తు కూడా భద్రం కావాలి”*

👉 తీరలాపురం మాజీ సర్పంచ్ *పాయం కామరాజు గారు,* రామానుజవరం మాజీ సర్పంచ్ *బాడీష సతీష్ గారు* రైతులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు!

*👉 ఈ పోరాటం రైతుల భవిష్యత్తును నిర్ణయించే ఒక మైలురాయి! ప్రతి రైతు సంఘటితంగా నిలబడాలి – పోరాటం కొనసాగించాలి*…. *మీ రామానుజవరం మాజీ సర్పంచ్ తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు బాడీష. సతీష్*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా ◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ,

Read More »

హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసాడు. ఎక్కడంటే?

నేటి గదర్ వెబ్ డెస్క్: విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్‌ గుంజీలు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో

Read More »

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ రోజు ఒక చీకటి రోజు :రేగా

★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు ★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ

Read More »

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “హోలీ హిందూ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో అదనపు పిటిఆర్ బిగించిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల నుండి విధ్యుత్ సమస్యలు ఉన్నందున మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి సమస్యను గ్రామ

Read More »

 Don't Miss this News !