+91 95819 05907

వైరస్ తో 2,500 బాయిలర్ కోళ్లు మృతి…. రైతు కు రూ.5 లక్షల నష్టం… నా గోడు ఆలకించేది ఎవరని రోదిస్తున్న ఆ రైతు.ఎక్కడంటే?

★అంతుపట్టని వైర్సతో కోళ్లు మృతి
★రూ.లక్షల్లో నష్టపోతున్న యజమానులు
★ ఆంధ్ర కోళ్ల వైరస్ తెలంగాణ కోళ్లకి సోకిందా?
★ బార్డర్ చెక్ పోస్టులలో నామమాత్రపు తనిఖీలు
★ అధికారులు ఇకనైనా నిద్రమత్తు వీడాలి

నేటి గదర్ న్యూస్,పినపాక:అంతుపట్టని వైరస్ దెబ్బకు ఖమ్మం జిల్లాలో.. నాటు, బ్రాయిలర్ కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఉదయం ఒక్క కోడికి వైరస్ సోకిందంటే చాలు.. సా యంత్రానికి ఆ షెడ్డులో ఉన్న వేలాది కోళ్లు ప్రాణా లు కోల్పోతున్నాయి దీంతో ఫారాల యజమానులు ఈ సీజన్లో తీవ్రసాయిలో నషాలు చవిచూసున్నారు. ఆంధ్ర కోళ్ళకి చూపిన వైరస్ తెలంగాణ కోళ్లకు కూడా సోకిందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన ఓ రైతుకు సంబంధించిన వేలాది కోళ్లు తెలియని వైరస్ తో మృతి చెందాయి. బాధిత రైతు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపతిరావుపేట సత్యనారాయణపురం గ్రామానికి చెందిన రైతు తాతిని సుబ్బారావు గత కొన్ని నెలల క్రితం ఓ కంపెనీకి చెందిన సుమారు 3వేల బాయిలర్ కోడి పిల్లలను తెచ్చి క్రాప్ వేయడం జరిగింది. తీరా చేతికి వచ్చే సమయానికి గత మూడు రోజుల నుంచి వాటికి తెలియని వైరస్ సోకి మృతి చెందినట్లు రోదిస్తూ తెలిపారు. కోళ్ల పెంపకానికి సంబంధించి ఇప్పటికే పెట్టుబడి లక్షల్లో పెట్టడం జరిగిందని రైతు తెలిపారు. మృతి చెందిన కోళ్ల విలువ రు.5లక్షలు ఉంటుంది అని రైతు సుబ్బారావు నేటి గదర్ డిజిటల్ న్యూస్ కి తెలిపారు. కోళ్ల మృతితో సర్వం కోల్పోయానని తీవ్ర అప్పుల ఊబిలో కురుకున్నానని రైతు ఆవేదన వెలుబు ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకుంటే తమ కుటుంబం వీధిన పడుతుందని రోధిస్తూ చెప్పారు.

★ఆంధ్ర బోర్డర్ చెక్ పోస్టు ల వద్ద నియంత్రణ ఏది?

ఆంధ్ర లో కోళ్ళకి వైరస్ సోకిన విషయం విధితమే. కానీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆ వైరస్ తెలంగాణకి పాకింది. అక్కడ అనేక కోళ్లు మృతి చెందుతున్నప్పటికిని ఆంధ్ర బోర్డర్ చెక్పోస్ట్ ల వద్ద అధికారులు నిద్రమత్తులో ఉండడంతో కొంతమందితెలంగాణ వ్యాపారస్తులు అక్కడి కోళ్లను తెలంగాణకి తీసుకురావడం జరిగింది. దీనితో ఆ వైరస్ తెలంగాణకి కూడా వ్యాప్తి చెందినట్లు పలువురు కోళ్ల ఫారం రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెక్ పోస్ట్ ల వద్ద అధికారులు ఇప్పటికైనా తనిఖీలు విస్తృతంగా చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మండలంలో పర్యటించిన టీజీ ఐడిసి చైర్మన్ మువ్వావిల్ విజయ్ బాబు, ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 14: దమ్మపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలో పర్యటించి నాచారం

Read More »

ఐక్యత ప్రెస్ క్లబ్ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం -ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: వేసవిలో మండల ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనయంని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్

Read More »

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా ◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ,

Read More »

హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసాడు. ఎక్కడంటే?

నేటి గదర్ వెబ్ డెస్క్: విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్‌ గుంజీలు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో

Read More »

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ రోజు ఒక చీకటి రోజు :రేగా

★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు ★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ

Read More »

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

 Don't Miss this News !