_ డాక్టర్ స్వర్ణ కుమారి , ఏవో తారా దేవి
ఖమ్మం : నేటిగదర్ న్యూస్, జిల్లా ప్రతినిధి, మార్చ్ 7 : మహిళల ముందడుగుతూనే సమాజంలో మహిళలకు సమానత్వంతో పాటు వారి సాధికారత మవుతుందని ప్రముఖ స్త్రీ , ప్ర సూతి వైద్య నిపుణురాలు స్వర్ణ కుమారి , కామేపల్లి అగ్రికల్చర్ ఏవో తారా దేవి అన్నారు. శుక్రవారం స్థానిక హోటల్ శ్రీధర్ కాన్ఫరెన్స్ హాలులో వీరనారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా” రాజ్యాంగం _ బహుజన మహిళలు సాధికారత” అంశంపై జరిగిన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తొలుత తారా దేవి మాట్లాడుతూ మహిళలు అటే చిన్న చూపుగా భావించే సమాజంలో మనం అధైర్య పడకుండా ముందుకు సాగాలని సూచించారు. స్త్రీల ఉన్నతితోనే సమాజం కూడా ఎదుగుతుందన్నారు. మనం నిర్ణయించుకున్న బాటలో మన ముందుకు సాగినప్పుడే మనకు సమానత్వం , సాధికారత లభ్యమవుతుందన్నారు. డాక్టర్ స్వర్ణ కుమారి మాట్లాడుతూ ఎలాంటి కష్టానికి నష్టానికి కుంగిపోకుండా ముందుకు సాగాలని , మహిళలలో అత్యధిక సంఖ్యలో బడుగు బలహీన వర్గాల వారు అభివృద్ధికి అభివృద్ధికి నోచుకోలేక పోతున్నారని , వీరు చదువు , ఆరోగ్యాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. నేడు యుక్త వయసు నుండి ప్రౌడ వయసు వరకు ఒక వైరస్ కారణంగా గర్భాశయ క్యాన్సర్ వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నివారణకు మహిళలు టీకాలు వేసుకోవాలని కోరారు. మహిళలు లేని సమాజం ఉండదని , మహిళల వల్లనే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. కనుక మహిళలు ధైర్యంతో ముందు అడుగులు వేయాలని తద్వారా సమాజంలో వారికి సమానత్వం , సాధికారత సిద్ధిస్తుంది అన్నారు. వీర నారీ మనుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి అధ్యక్షత వహించి , మాట్లాడుతూ మహిళల సమగ్ర అభివృద్ధికి పాటుపడిన సావిత్రిబాయి పూలే రమాబాయి , పెళ్లి లలిత వంటి వీరనారీమణుల వారి స్ఫూర్తితో వారి ఆశ య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలుత వీరానారీమణుల చిత్రపటాలకు పూల మాలలు వేసి , నివాళులు అర్పించారు. అనంతరం లంబాడీ హక్కుల పోరాట స మితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు త్రివేణి ప్ర బానోతు బద్రు నాయక్ ను మహిళలు ఘనంగా సన్మానించారు. సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు బాణోతు త్రివేణి ప్రసంగించ గా కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు జ్యోతి , కార్యదర్శి స్పందన , సహాయ కార్యదర్శి విజయ , అధికార ప్రతినిధి ఝాన్సీ , జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి , సలహాదారులు లక్ష్మి , గాయకుడు ,రచయిత ఫక్రుద్దీన్ , గాయకుడు పెద్దపాక విజయ్ , ఝాన్సీ , ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు జి. రవీందర్ , బానోతు వీరన్న , పెద్దపాక నాగభూషణం , నాగరాజు, రమేష్ , గౌరవ సలహాదారులు శ్రీదేవి , పి. రవి , భవాని , శ్రీదేవి , సరోజిని ,రమ్య , కృష్ణవేణి తదితరులు పాల్గొన గా ముఖ్య అతిథులు డా. స్వర్ణ కుమారి , తార దేవి తో పాటు ఇతర మహిళలను కూడా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి , మహిళ దినోత్సవ శుభాకాంక్షలు ప్రకటించారు.
