+91 95819 05907

సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముట్టడి

★గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను తక్షణమే చెల్లించాలి…

★సిఐటియు జిల్లా నాయకులు : సత్రపల్లి సాంబశివరావు.

మణుగూరు మార్చి 7: మణుగూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని,సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో తెల్లూరి శ్రీనివాసరావుకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ప్రజా పాలనలో పంచాయతీ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆయన ఆరోపించారు.2025 సంవత్సరం జనవరి ఒకటో తేదీ నాటికి పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ మూడు నెలలు కావస్తున్న వేతనాలు చెల్లించకపోవడం వలన కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలను,వేతనాలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లింపు పై రాష్ట్ర ప్రభుత్వం 2025 జనవరి 19న 149 కోట్ల రూపాయలు విడుదల చేసింది కానీ పంచాయతీల ఎకౌంటు నుండి పంపిన చెక్కులు ఎస్ టి ఓ కార్యాలయంలో నిలిచిపోవడంతో కార్మికులకు వేతనాలు అందని పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీల ఎకౌంటు నుండి వేతనాలు చెల్లించేందుకు వీలు లేకుండా పంచాయతీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజింగ్ చేయడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఎస్ టి ఓ కార్యాలయంలో నిలిచిపోయిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఆయన అన్నారు.ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఒక పూట పని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొడిశాల రాములు. సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు దామల వెంకన్న Gp జిల్లా నాయకులు రంగా. సదానందం. వెంకటేశ్వర్లు. పొడుతూరి రాములు. తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా ◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ,

Read More »

హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసాడు. ఎక్కడంటే?

నేటి గదర్ వెబ్ డెస్క్: విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్‌ గుంజీలు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో

Read More »

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ రోజు ఒక చీకటి రోజు :రేగా

★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు ★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ

Read More »

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “హోలీ హిందూ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో అదనపు పిటిఆర్ బిగించిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల నుండి విధ్యుత్ సమస్యలు ఉన్నందున మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి సమస్యను గ్రామ

Read More »

 Don't Miss this News !