★ ఎకరానికి వేల పెట్టుబడి పెట్టె
★ చేతికొచ్చే సమయానికి పొలాలు నెర్రలు బాసే
★ఎండిన చెరువుల
★ పడిపోయిన గ్రౌండ్ వాటర్
★ కొరవడిన ప్రభుత్వం ముందుచూపు
★ రైతన్నలను చైతన్యం చేయడంలో విఫలం
★ మేల్, ఫీమేల్ సీడ్స్ మూలంగా బాగా పెరిగిన సాగు విస్తీర్ణం
★ రైతన్నను ప్రభుత్వ ఆదుకోవాలి
★నేటి గదర్ ప్రత్యేక కథనం
✍️KDR
నేటి గదర్ న్యూస్,పినపాక: రైతుకు కష్టకాలం వచ్చింది… ఎకరాకు వేల పెట్టుబడి పెట్టి వ్యవసాయం సాగు చేస్తే తీరా నోటికాడికి వచ్చాక పొలాలు నెర్రెలు బస్తున్నాయ్… పలుచోట్ల కంకులు వెళ్లబట్టినప్పటికీ…. సరిపడ నీటి సౌకర్యం లేకపోవడంతో ఎండిపోతున్నాయి. ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం రైతులకు ఈ దుస్థితి నెలకొంది. రైతుల దిన గాధ పై నేటి గద్దర్ ప్రత్యేక కథనం.యాసంగి వరి పంట వేసిన రైతులకు పొలాలు ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది. బోర్లు సహాయంతో యాసంగి పంట పండుతాయి అన్న ఆశలు అడియాశలు గానే మిగిలిపోయాయి. ప్రతి సంవత్సరం లాగానే పినపాక మండలం లో ఈ సంవత్సరం కూడా యాసంగి వరి సాగు చేసిన రైతులకు నీళ్లు రాక చెరువులో నీరు ఎండిపోవడంతో పొలాల్లో ఉన్న బోర్ల లో నీరు లేక వరి ఎండిపోతుంది. చేతికి వచ్చే సమయంలో పంట కళ్ళముందే ఎండిపోతుంటే, నీరు కోసం ఎదురుచూస్తున్న రైతును ప్రభుత్వ అధికారులు, పెద్దలు కనికరించడం లేదని వాదన వినిపిస్తోంది. మండల పరిధిలోని పినపాక ,గడ్డంపల్లి, జానంపేట, తో గూడెం, గోపాలరావుపేట, పొట్లపల్లి, టీ కొత్తగూడెం తదితర గ్రామాలలో రైతన్న వేల ఎకరాలలో వరి సాగు చేశారు. తొలినాళ్లలో నీరు సమృద్ధిగా ఉండడంతో వరి చేళ్లు ఏపుగా పెరిగాయి. తీరా వరి చేళ్లు ఈని కంకి బయటకు తీసే సమయానికి సరిపడా నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఇప్పటికీ వరి పొలానికి అధిక మొత్తంలో ఖర్చు చేసి ఉన్నారు. వరి విత్తనాలు జల్లిన మొదలు దూకితుండడం, వరి నాటడం, మందులు పిచికారి చేయడం వీటన్నిటికీ కలిపి ప్రతి ఎకరాకు దాదాపుగా రూ.30 వేల వరకు రైతు అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. పంట వస్తదనుకున్న సమయంలో వరి పొలాలు ఎండిపోతుండడంతో రైతన్నకు ఏమి పాలు పోవడం లేదు. దీనితో రైతన్న పుట్టెడు దుఃఖంతో రోదిస్తున్నారు. ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం, గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోవడం, చెరువులు ఎండిపోవడం లాంటి విషయాలు రైతన్న గోసకు కారణమయ్యాయి. అలాగే ఉమ్మడి పినపాక మండలంలో మేల్ ఫిమేల్ సీడ్స్ మూలంగా సాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. ఆయా కంపెనీలు రైతులకు ముందుగానే పెట్టుబడి ఎరవేసి నాటు పెట్టిస్తున్నారు. దీనితో వారు ఆడ మగ వరి నాటగా అనేకమంది రైతులకు సరిపడా నీరు సౌకర్యం లేకపోవడంతో ఎండిపోతున్నాయి. ప్రభుత్వం ముందే మేల్కొని రైతులకు అవగాహన కల్పించి ఉంటే బాగుండదని రైతన్నలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనేకమంది రైతులు అత్యధిక పెట్టుబడులు పెట్టడం మూలంగా అప్పుల ఊబిలో కూరుకు పోయారు. పంట చివరి దశకు రావడంతో నీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.